AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖ యూత్‌పై గంజాయి పంజా..

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్‌, గంజాయి, మత్తుమందు కేసులు వెలుగు చూసిన ప్రతిసారి వీఐపీలు, ప్రముఖుల పేర్లు తెరమీదకు రావటం విస్మయానికి గురిచేస్తుంది. ముఖ్యంగా ప్రముఖుల పిల్లలే ఎక్కువగా ఈ డ్రగ్స్‌ కేసుల్లో పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా, విశాఖపట్నంలో బయటపడ్డ గంజాయి స్మగ్లింగ్‌ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. నిందితుల్లో హెడ్‌కానిస్టేబుల్‌, డీఎస్పీ స్థాయి అధికారుల పిల్లలు ఉన్నట్లుగా పోలీసు విచారణలో తేలింది. ఇటీవల విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలెంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురు […]

విశాఖ యూత్‌పై గంజాయి పంజా..
Ram Naramaneni
|

Updated on: Jan 24, 2020 | 7:19 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్‌, గంజాయి, మత్తుమందు కేసులు వెలుగు చూసిన ప్రతిసారి వీఐపీలు, ప్రముఖుల పేర్లు తెరమీదకు రావటం విస్మయానికి గురిచేస్తుంది. ముఖ్యంగా ప్రముఖుల పిల్లలే ఎక్కువగా ఈ డ్రగ్స్‌ కేసుల్లో పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా, విశాఖపట్నంలో బయటపడ్డ గంజాయి స్మగ్లింగ్‌ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. నిందితుల్లో హెడ్‌కానిస్టేబుల్‌, డీఎస్పీ స్థాయి అధికారుల పిల్లలు ఉన్నట్లుగా పోలీసు విచారణలో తేలింది. ఇటీవల విశాఖపట్నం జిల్లా కూర్మన్నపాలెంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను వెంబడించారు పోలీసులు. గంజాయి స్మగ్లింగ్‌ ముఠాలో ఇద్దరు యువకులు పట్టుబడగా, మరో ఇద్దరు పరారైనట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన యువకులను విచారించగా పోలీసులకే షాక్‌ తగిలే నిజాలు బయటపడ్డాయి. పట్టుబడిన ఇద్దరు యువకుల్లో ఒకరు హెడ్‌కానిస్టేబుల్‌ కొడుకు మోనీష్‌, పారిపోయిన వారిలో డీఎస్పీ కొడుకు మనోజ్‌ ఉన్నట్లుగా తేలింది.

వీరంతా శుభకార్యం కోసం కారులో విశాఖ వచ్చారని, ఏజెన్సీలో బ్రోకర్ల ద్వారా గంజాయిని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మోనీష్‌, మన్సూర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు. వారు ప్రయాణించిన కారును సీజ్‌ చేశారు. మరోవైపు పారిపోయిన మనోజ్‌, బాబీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరంతా గుంటూరు, ప్రకాశం, విజయవాడకు చెందిన వారుగా గుర్తించారు.  విశాఖ ఏజెన్సీ అడ్డగా చేసుకుని మత్తు పదార్థాల స్మగ్లింగ్‌ జోరుగా సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, విద్యార్థులే ఎక్కువగా ఈ గంజాయిలో తరిస్తూ పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. కూర్మన్న పాలెంలో పట్టుబడిన వారు ఇంజినీరింగ్‌ విద్యార్థులుగా గుర్తించారు. కాగా, గతంలో ముగ్గురు మెడికోలు, మరో ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు దొరికిపోయారు. అయితే, గంజాయి కేసులో పట్టుబడిన వారిపై చర్యలు చాలా కఠినంగా ఉంటాయంటున్నారు పోలీసులు. దీంతో విశాఖ యువత ఎటు పోతుందనే ఆందోళన స్థానికులను మరింత కలవరపెడుతోంది

Follow Us
మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?
మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?
తొలిరోజే స్కూల్‌కు తాళం.. ఇంతకీ మ్యాటర్ ఏమంటే..?
తొలిరోజే స్కూల్‌కు తాళం.. ఇంతకీ మ్యాటర్ ఏమంటే..?
ఇదెక్కడి వెల్ కమ్ సామీ.. అనిల్ కామెడీ అంటే మాములుగా ఉండదు మరీ..
ఇదెక్కడి వెల్ కమ్ సామీ.. అనిల్ కామెడీ అంటే మాములుగా ఉండదు మరీ..
ఇది నిజమేనా..? రాత్రిపూట ఈల వేస్తే దెయ్యాలు వస్తాయా..!?
ఇది నిజమేనా..? రాత్రిపూట ఈల వేస్తే దెయ్యాలు వస్తాయా..!?
అనుకున్నది సాధిస్తారు..Vతో పేరు ప్రారంభమయ్యే వారి వ్యక్తిత్వం ఇదే
అనుకున్నది సాధిస్తారు..Vతో పేరు ప్రారంభమయ్యే వారి వ్యక్తిత్వం ఇదే
GenZల ఫేవరెట్‌ డెస్టినేషన్స్‌ లిస్ట్‌లో ఉన్నవి ఏంటో తెలుసా
GenZల ఫేవరెట్‌ డెస్టినేషన్స్‌ లిస్ట్‌లో ఉన్నవి ఏంటో తెలుసా
కనిపించినంత సున్నితం కాదు.. ప్రియుడు కోసం ఏం చేసిందంటే
కనిపించినంత సున్నితం కాదు.. ప్రియుడు కోసం ఏం చేసిందంటే
డయాబెటీస్ ఉన్నవారికి ఈ జ్యూస్ దివ్వ ఔషదం.. రోజూ ఒక్క గ్లాస్ తాగిత
డయాబెటీస్ ఉన్నవారికి ఈ జ్యూస్ దివ్వ ఔషదం.. రోజూ ఒక్క గ్లాస్ తాగిత
జపనీయులు జీవన సూత్రాలు..! మీ జీవితం మారిపోవడం ఖాయం..!
జపనీయులు జీవన సూత్రాలు..! మీ జీవితం మారిపోవడం ఖాయం..!
రోజుకు ఎన్ని లీటర్ల డీజిల్ కొనుగోలు చేయవచ్చు..? కేంద్రం రూల్స్
రోజుకు ఎన్ని లీటర్ల డీజిల్ కొనుగోలు చేయవచ్చు..? కేంద్రం రూల్స్