AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో వివాదంలో తాడికొండ ఎమ్మెల్యే..!

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మరో వివాదంలో ఇరుక్కున్నారు. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన మేకల రవి అనే వ్యక్తి.. ఎమ్మెల్యే శ్రీదేవి తనకు కోటి 40 లక్షలు ఇవ్వాలంటూ సోషల్‌ పెట్టిన పోస్ట్‌ సంచలనం రేపుతోంది.

మరో వివాదంలో తాడికొండ ఎమ్మెల్యే..!
Sanjay Kasula
|

Updated on: Sep 14, 2020 | 11:19 AM

Share

తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మరో వివాదంలో ఇరుక్కున్నారు. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన మేకల రవి అనే వ్యక్తి.. ఎమ్మెల్యే శ్రీదేవి తనకు కోటి 40 లక్షలు ఇవ్వాలంటూ సోషల్‌ పెట్టిన పోస్ట్‌ సంచలనం రేపుతోంది. తన భర్త డబ్బులు ఇవ్వకుండా మోసం చేశాడని ఎన్నికల సమయంలో ఉండవల్లి శ్రీదేవి తన దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకోవడంతో తనకు తెలిసిన వారి దగ్గర నుంచి తీసుకుని ఇచ్చానని చెబుతున్నాడు. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే ఇప్పటి వరకు 60 లక్షలు మాత్రమే ఇచ్చారని, ఇంకా 80 లక్షలు రావాల్సి ఉందన్నాడు. బ్యాలెన్స్‌ ఇచ్చేది లేదంటూ బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నాడు బాధితుడు.

ఈ విషయంలో తనకు సీఎం జగన్‌ తనకు న్యాయం చేయాలని,లేకపోతే రాజధాని ప్రాంతంలో జరిగే మొదటి వైసీపీ కార్యకర్త ఆత్మహత్య తనదే అంటున్నాడు. అయితే వైసీపీ నేతలు మాత్రం మేకల రవి అంత డబ్బు ఎమ్మెల్యేకు ఇవ్వలేదని చెబుతున్నారు.

అతనికి ఉన్న ఆస్తి విలువ చూసుకున్నా నమ్మశక్యంగా లేదంటున్నారు. మరోవైపు కోటి 40 లక్షలు రూపాయలు కనీసం అగ్రిమెంట్‌, నోట్‌ లాంటివి కూడా ఏమీ లేవంటున్నారు. రవికి అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చేవారు కూడా ఎవరూ లేరంటున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని హెచ్చరిస్తున్నారు. మరి పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.