AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దంపతుల మధ్య మనస్పర్ధలు.. ఆత్మహత్య బెదిరింపులతో ఇల్లు వదిలిన భార్య, గోదావరిలో దూకి చనిపోయిన భర్త .!

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో విషాదం నెలకొంది. దంపతుల మధ్య నెలకొన్న మనస్పర్ధలు నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. భార్య ఆత్మహత్య బెదిరింపు..

దంపతుల మధ్య మనస్పర్ధలు.. ఆత్మహత్య బెదిరింపులతో ఇల్లు వదిలిన భార్య, గోదావరిలో దూకి చనిపోయిన భర్త  .!
Venkata Narayana
|

Updated on: Dec 15, 2020 | 1:38 PM

Share

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురులో విషాదం నెలకొంది. దంపతుల మధ్య నెలకొన్న మనస్పర్ధలు నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. భార్య ఆత్మహత్య బెదిరింపు చివరకు భర్త ప్రాణాలను తీశాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బంధులను కన్నీటి సంద్రంలో ముంచెత్తింది. మామిడి కుదురులో నివాసముంటున్న దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు తలెత్తాయి. ఈ వివాదాలు చినికిచినికి గాలివానగా మారాయి. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకుంటానంటూ భర్తకు చెప్పిన భార్య ఇళ్లు వదిలి వెళ్లిపోయింది. భర్త ఆమె కోసం చాలా వెతికినా దొరకలేదు. భార్య నిజంగా ఆత్మహత్య చేసుకుందని అనుకున్న భర్త, తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, తాను క్షేమంగానే ఉన్నాని భార్య ఆమె బంధువులకు ఫోన్‌ చేసింది. చివరకు ఈ గొడవల్లో భర్త బలైపోయాడు.