AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కశ్మీర్‌ స్వర్గంగా మారితే మేమూ సంతోషిస్తాం: అఖిలేశ్‌

జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలేశ్‌ మాట్లాడుతూ.. ‘‘జమ్మూకశ్మీర్‌లో ఏం జరుగుతుందో తనకు తెలియదని రెండు రోజుల క్రితమే అక్కడి గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ చెప్పారు. కొన్ని గంటల తర్వాత  ఏం జరిగిందో దేశమంతటికీ తెలిసిపోయింది. కేంద్రం చెప్పమన్న విషయాలనే అక్కడి గవర్నర్‌ చెబుతున్నారు. జమ్మూకశ్మీర్‌ ప్రజలు సంతోషంగా ఉన్నారో, దుఃఖంగా ఉన్నారో తెలియాలి. కేవలం 20 కోట్ల మంది ప్రజల […]

కశ్మీర్‌ స్వర్గంగా మారితే మేమూ సంతోషిస్తాం: అఖిలేశ్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 06, 2019 | 8:45 PM

Share

జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర పునర్విభజన బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలేశ్‌ మాట్లాడుతూ.. ‘‘జమ్మూకశ్మీర్‌లో ఏం జరుగుతుందో తనకు తెలియదని రెండు రోజుల క్రితమే అక్కడి గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ చెప్పారు. కొన్ని గంటల తర్వాత  ఏం జరిగిందో దేశమంతటికీ తెలిసిపోయింది. కేంద్రం చెప్పమన్న విషయాలనే అక్కడి గవర్నర్‌ చెబుతున్నారు. జమ్మూకశ్మీర్‌ ప్రజలు సంతోషంగా ఉన్నారో, దుఃఖంగా ఉన్నారో తెలియాలి. కేవలం 20 కోట్ల మంది ప్రజల కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. కశ్మీర్‌ స్వర్గంగా మారితే మేమూ సంతోషిస్తాం. కశ్మీర్‌ మాకూ కావాలి. అక్కడ అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారు. గత రెండు రోజులుగా ఏం జరుగుతుందో చూస్తున్నాం. జరుగుతున్న పరిణామాలతో కశ్మీర్‌ ప్రజలు ఆందోళనలో ఉన్నారు… అని అఖిలేశ్‌ పేర్కొన్నారు.