ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు హెచ్చరిక..!

ఈపీఎఫ్ఓ ఖాతాదారులు జర భద్రం.. ఒక ఫేక్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సంస్థ రూ.80,000లు బహుమతి ఇస్తుందని.. ఇది కేవలం 1990 నుంచి 2019 మధ్య కాలంలో పని చేసిన వారికే వర్తిస్తుందని..ఇక దాన్ని పొందాలంటే కింద ఇచ్చిన వెబ్ సైట్ లింక్‌లో వివరాలు తెలియజేయాలంటూ ఓ వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. ఇక ఈ మెసేజ్ చూసిన వారందరూ ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సంస్థ అవన్నీ వట్టి […]

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు హెచ్చరిక..!
Follow us

|

Updated on: Nov 02, 2019 | 1:06 AM

ఈపీఎఫ్ఓ ఖాతాదారులు జర భద్రం.. ఒక ఫేక్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సంస్థ రూ.80,000లు బహుమతి ఇస్తుందని.. ఇది కేవలం 1990 నుంచి 2019 మధ్య కాలంలో పని చేసిన వారికే వర్తిస్తుందని..ఇక దాన్ని పొందాలంటే కింద ఇచ్చిన వెబ్ సైట్ లింక్‌లో వివరాలు తెలియజేయాలంటూ ఓ వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది.

ఇక ఈ మెసేజ్ చూసిన వారందరూ ఈపీఎఫ్ఓకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సంస్థ అవన్నీ వట్టి పుకార్లు, ఫేక్ వార్తలని స్పష్టం చేసింది. ఈపీఎఫ్ఓ నుంచి ఎటువంటి కాల్స్, మెసేజ్స్ వచ్చినా కూడా స్పందించరాదని ఖాతాదారులను హెచ్చరించింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ద్వారా ఇటువంటి వాటితో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది.

మరోవైపు ఆ సందేశంలో ఇచ్చిన వెబ్‌సైట్‌ను కూడా పరిశీలిస్తే కావాలని ఎవరో ఉద్దేశపూర్వకంగానే రూపొందించినట్లు ఫ్యాక్ట్ చెక్‌లో తేలిపోయింది. ముఖ్యంగా గవర్నమెంట్ వెబ్‌సైట్స్ అన్నీ .gov.in ద్వారా డోమైన్ పూర్తి అవుతోంది. ఇకపోతే ఈపీఎఫ్ఓ అఫీషియల్ వెబ్‌సైట్  www.epfindia.gov.in.

అంతేకాకుండా ఈ ఫేక్ వెబ్‌సైట్ డొమైన్ ద్వారా మరికొన్ని నిజాలు బయటపడ్డాయి. గతంలో ఫేక్ హోండా షోరూమ్ వెబ్‌సైట్‌గా 300 యాక్టివాలు దివాళీ ఆఫర్‌లో ఫ్రీగా ఇస్తున్నట్లు జనాలను నమ్మించిందట.  కాబట్టి ప్రజలు ఇలాంటి ఫేక్ వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ ఈపీఎఫ్ఓ సంస్థ హెచ్చరిస్తోంది.