AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసును‌ చేధించిన‌ పోలీసులు

కృష్ణా జిల్లా విసన్నపేట ట్రిపుల్‌ మర్డర్‌ కేసును ఛేదించారు పోలీసులు. నిందితులైన వెంకన్న, నాగమణి దంపతులతో పాటు వారి కొడుకును అరెస్ట్‌ చేశారు.

సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసును‌ చేధించిన‌ పోలీసులు
Balaraju Goud
|

Updated on: Oct 06, 2020 | 10:11 PM

Share

కృష్ణా జిల్లా విసన్నపేట ట్రిపుల్‌ మర్డర్‌ కేసును ఛేదించారు పోలీసులు. నిందితులైన వెంకన్న, నాగమణి దంపతులతో పాటు వారి కొడుకును అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఆటోతో పాటు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పశ్చిమగోదావరి జిల్లా చిలకలపూడికి చెందిన వారిగా గుర్తించారు. రెక్కీ నిర్వహించి హత్యలకు పాల్పడ్డాట్లు పోలీసులు తెలిపారు.

విస్సన్నపేటలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. అయితే అది ప్రమాదం కాదు.. ట్రిపుల్ మర్డర్‌ అని పోలీసుల విచారణలో తేలింది. రోడ్డు ప్రమాదంగా క్రియేట్ చేసి ముగ్గుర్ని హత్య చేశారు వెంకన్న దంపతులు. కేసు వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించారు. మృతుడు చిన్నస్వామి భార్యతో దాసరి వెంకన్నకు వివాహేతర సంబంధం ఉందని తేల్చారు. దీంతో చిన్నస్వామి, దాసరి వెంకన్న మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అతణ్ని చంపేయాలని దాసరి వెంకన్న ప్లాన్‌ చేశాడని చెప్పారు. చినస్వామికి మద్యం తాగించి హత్యలకు కుట్ర పన్నారని పోలీసులు వివరించారు.

నూజివీడు వెళ్దామని చిన్నస్వామి దంపతులతోపాటు వారి కూతురుని ఆటోలో తీసుకెళ్లారు దాసరి వెంకన్న దంపతులు. దారి మధ్యలోనే వారిని హతమార్చి… రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి, తప్పించుకుందామనుకున్నారు. ముచ్చినపల్లి మామిడి తోట వద్దకు రాగానే ఆటో ఆపి చినస్వామిపై మారణాయుధాలతో దాడి చేశాడు వెంకన్న. అది చూసి పారిపోతున్న భార్య తిరుపతమ్మను రాడ్డుతో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతుల కుమార్తెను గొంతు బిగించి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఆటో కల్వర్ట్‌ను ఢీ కొట్టడంతో యాక్సిడెండ్‌ జరిగిందని మొదట అందరిని నమ్మించారు. నిందితుల నుండి ఆటోను, మారణాయుధాలు, దుస్తులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీసులకు దొరికిన క్లూస్‌ ఆధారంగా గంటల వ్యవధిలోనే ట్రిపుల్‌ మర్డర్‌ కేసును ఛేదించారు.

Follow Us
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఇటుక..521.2 కిలోల గోల్డ్‌బార్‌ చూస్తే
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఇటుక..521.2 కిలోల గోల్డ్‌బార్‌ చూస్తే
ఒకప్పుడు సాధారణ ఆహారం.. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్!
ఒకప్పుడు సాధారణ ఆహారం.. ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్!
క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాను మించి,అర్ధరాత్రి ఐదుగురు ముసుగు దొంగలు
క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాను మించి,అర్ధరాత్రి ఐదుగురు ముసుగు దొంగలు
బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంటి వద్దకే బస్సు
బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంటి వద్దకే బస్సు
ఏం మారింది భయ్యా.. జగపతి బాబు కూతురు ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
ఏం మారింది భయ్యా.. జగపతి బాబు కూతురు ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
కడప రైతు వరదరాజ్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా..?
కడప రైతు వరదరాజ్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా..?
1 నుంచి 10వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో కీలక మార్పులు..!
1 నుంచి 10వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో కీలక మార్పులు..!
కావాలనే తొక్కేస్తున్నారా? కనీసం బ్యాకప్‌కి కూడా పనికిరాడా?
కావాలనే తొక్కేస్తున్నారా? కనీసం బ్యాకప్‌కి కూడా పనికిరాడా?
8 వేల కేజీల స్వీట్లు, పండ్లతో భీమవరం ఆలయంలో భారీ వేడుక!
8 వేల కేజీల స్వీట్లు, పండ్లతో భీమవరం ఆలయంలో భారీ వేడుక!
చేతుల్లో పటుత్వం ఉండటం లేదా? ఇది తింటే కొండంత బలం
చేతుల్లో పటుత్వం ఉండటం లేదా? ఇది తింటే కొండంత బలం