AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: అడుగడుగునా పోలీసు బలగాలు.. అయోధ్య వీధుల్లో భద్రత కట్టుదిట్టం..!

నూతన సంవత్సరం, ప్రాణ ప్రతిష్ఠ ద్వాదశి సందర్భంగా పవిత్ర నగరమైన అయోధ్యలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నగరంలోని ప్రధాన రహదారులపై అకస్మాత్తుగా భారీ పోలీసు బందోబస్తును మోహరించారు. అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఇంటెన్సివ్ తనిఖీలు చేపడుతున్నారు. పోలీస్ ఆపరేషన్‌లో భక్తులతో పాటు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Ayodhya: అడుగడుగునా పోలీసు బలగాలు.. అయోధ్య వీధుల్లో భద్రత కట్టుదిట్టం..!
Ayodhya Intensive Checking
Balaraju Goud
|

Updated on: Dec 30, 2025 | 10:01 AM

Share

నూతన సంవత్సరం, ప్రాణ ప్రతిష్ఠ ద్వాదశి సందర్భంగా పవిత్ర నగరమైన అయోధ్యలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. నగరంలోని ప్రధాన రహదారులపై అకస్మాత్తుగా భారీ పోలీసు బందోబస్తును మోహరించారు. అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఇంటెన్సివ్ తనిఖీలు చేపడుతున్నారు. పోలీస్ ఆపరేషన్‌లో భక్తులతో పాటు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అయోధ్య సర్కిల్ ఆఫీసర్ నాయకత్వంలో, పోలీసు, PAC, ఇతర భద్రతా సంస్థల సంయుక్త బృందాలు ప్రతి వాహనం, అనుమానాస్పద కార్యకలాపాలను నిశితంగా పరిశీలించాయి.

తనిఖీ సమయంలో, భక్తుల సౌకర్యానికి అత్యంత శ్రద్ధ వహించారు. దర్శనం, పూజ కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వాహనాల నుండి బ్లాక్ ఫిల్మ్ తొలగించి, నిబంధనలను ఉల్లంఘించే లగ్జరీ వాహనాలకు జరిమానా విధిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిని బ్రీత్ అనలైజర్లతో పరీక్షించారు. దోషులుగా తేలిన వారికి జరిమానాలు విధించారు.

నూతన సంవత్సరం సందర్భంగా లక్షలాది మంది భక్తులు రామ్ లల్లాను సందర్శించి పూజించడానికి రామనగరికి వస్తున్నారని స్థానికల అధికారి అశుతోష్ తివారీ పేర్కొన్నారు. వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అధికార యంత్రాంగం సిసిటివి కెమెరాల ద్వారా నిఘా పెంచింది. సున్నితమైన ప్రదేశాలలో అదనపు పోలీసు బలగాలను మోహరించింది. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అశుతోష్ తివారీ తెలిపారు. అయోధ్య నియమాలను పాటించాలని, సహకరించాలని అన్ని పౌరులు, భక్తులకు అధికారులు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..