AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీ: శాడిస్ట్ క్రిమినల్ హతం.. 23 మంది చిన్నారులు సేఫ్!

UP Hostage Crisis: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో 23 మంది చిన్నారులను బందీగా చేసుకున్న ఆగంతుకుడిని గురువారం రాత్రి కమాండోలు రెస్క్యూ ఆపరేషన్‌లో హతమార్చారు. అంతేకాక గాయాలతో ఆసుపత్రి పాలైన అతని భార్య కూడా మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ హత్యకేసులో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న సుభాష్ బాథమ్ అనే నిందితుడు ఇటీవల పెరోల్ మీద బయటికి వచ్చాడు. తన కూతురు గౌరి బర్త్‌డే పార్టీకి రమ్మని చుట్టుపక్కల పిల్లలను ఆహ్వానించాడు. దాదాపు 23 […]

యూపీ: శాడిస్ట్ క్రిమినల్ హతం.. 23 మంది చిన్నారులు సేఫ్!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jan 31, 2020 | 10:25 AM

Share

UP Hostage Crisis: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో 23 మంది చిన్నారులను బందీగా చేసుకున్న ఆగంతుకుడిని గురువారం రాత్రి కమాండోలు రెస్క్యూ ఆపరేషన్‌లో హతమార్చారు. అంతేకాక గాయాలతో ఆసుపత్రి పాలైన అతని భార్య కూడా మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ హత్యకేసులో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న సుభాష్ బాథమ్ అనే నిందితుడు ఇటీవల పెరోల్ మీద బయటికి వచ్చాడు. తన కూతురు గౌరి బర్త్‌డే పార్టీకి రమ్మని చుట్టుపక్కల పిల్లలను ఆహ్వానించాడు. దాదాపు 23 మంది చిన్నారులు ఇంట్లోకి రాగానే తలుపులు మూసేసి వారిని బందీలుగా చేసుకున్నాడు.

ఈలోపు బబ్లీ అనే పొరిగింటి మహిళ తన కుమార్తెను తీసుకెళ్లేందుకు వెళ్లగా.. సుభాష్ తలుపు తియ్యడానికి నిరాకరించడమే కాకుండా ఆమెను తిట్టి పంపించాడు. ఆమె తన ఇంట్లోని కుటుంబసభ్యులకు జరిగిన విషయాన్ని తెలియజేసింది. ఇక స్థానికులు, గ్రామస్తులు కలిసి సుభాష్ ఇంటి తలుపును విరగొట్టడానికి ప్రయత్నించగా.. అతడు వారిపై కాల్పులు జరిపాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.

క్విక్ రియాక్షన్ టీమ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. తలుపులు తెరవాలని వారు ఆదేశించినా కూడా సుభాష్ వినకుండా కిటికీ నుంచి గ్రానైడ్‌ను విసరడమే కాకుండా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయాలపాలయ్యారు. ఇక సుమారు 10 గంటల పాటు జరిగిన ఈ హైడ్రామాలో చివరికి నిందితుడిని కమాండోలు మట్టుబెట్టారు. అటు సుభాష్ భార్య స్థానికుల దాడిలో గాయాలపాలవడంతో పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాసను విడిచింది. ‘నిందితుడు కాల్పుల్లో చనిపోయాడని.. అతని చెరలో ఉన్న 23 మంది పిల్లలను సురక్షితంగా కాపాడామని’ డీజీపీ ఓపి సింగ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్