AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీ: శాడిస్ట్ క్రిమినల్ హతం.. 23 మంది చిన్నారులు సేఫ్!

UP Hostage Crisis: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో 23 మంది చిన్నారులను బందీగా చేసుకున్న ఆగంతుకుడిని గురువారం రాత్రి కమాండోలు రెస్క్యూ ఆపరేషన్‌లో హతమార్చారు. అంతేకాక గాయాలతో ఆసుపత్రి పాలైన అతని భార్య కూడా మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ హత్యకేసులో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న సుభాష్ బాథమ్ అనే నిందితుడు ఇటీవల పెరోల్ మీద బయటికి వచ్చాడు. తన కూతురు గౌరి బర్త్‌డే పార్టీకి రమ్మని చుట్టుపక్కల పిల్లలను ఆహ్వానించాడు. దాదాపు 23 […]

యూపీ: శాడిస్ట్ క్రిమినల్ హతం.. 23 మంది చిన్నారులు సేఫ్!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jan 31, 2020 | 10:25 AM

Share

UP Hostage Crisis: ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో 23 మంది చిన్నారులను బందీగా చేసుకున్న ఆగంతుకుడిని గురువారం రాత్రి కమాండోలు రెస్క్యూ ఆపరేషన్‌లో హతమార్చారు. అంతేకాక గాయాలతో ఆసుపత్రి పాలైన అతని భార్య కూడా మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ హత్యకేసులో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న సుభాష్ బాథమ్ అనే నిందితుడు ఇటీవల పెరోల్ మీద బయటికి వచ్చాడు. తన కూతురు గౌరి బర్త్‌డే పార్టీకి రమ్మని చుట్టుపక్కల పిల్లలను ఆహ్వానించాడు. దాదాపు 23 మంది చిన్నారులు ఇంట్లోకి రాగానే తలుపులు మూసేసి వారిని బందీలుగా చేసుకున్నాడు.

ఈలోపు బబ్లీ అనే పొరిగింటి మహిళ తన కుమార్తెను తీసుకెళ్లేందుకు వెళ్లగా.. సుభాష్ తలుపు తియ్యడానికి నిరాకరించడమే కాకుండా ఆమెను తిట్టి పంపించాడు. ఆమె తన ఇంట్లోని కుటుంబసభ్యులకు జరిగిన విషయాన్ని తెలియజేసింది. ఇక స్థానికులు, గ్రామస్తులు కలిసి సుభాష్ ఇంటి తలుపును విరగొట్టడానికి ప్రయత్నించగా.. అతడు వారిపై కాల్పులు జరిపాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.

క్విక్ రియాక్షన్ టీమ్, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. తలుపులు తెరవాలని వారు ఆదేశించినా కూడా సుభాష్ వినకుండా కిటికీ నుంచి గ్రానైడ్‌ను విసరడమే కాకుండా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయాలపాలయ్యారు. ఇక సుమారు 10 గంటల పాటు జరిగిన ఈ హైడ్రామాలో చివరికి నిందితుడిని కమాండోలు మట్టుబెట్టారు. అటు సుభాష్ భార్య స్థానికుల దాడిలో గాయాలపాలవడంతో పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాసను విడిచింది. ‘నిందితుడు కాల్పుల్లో చనిపోయాడని.. అతని చెరలో ఉన్న 23 మంది పిల్లలను సురక్షితంగా కాపాడామని’ డీజీపీ ఓపి సింగ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఓరీ దేవుడో.. మనం వాడుతున్న పసుపు నకిలీదా..? ఎలా గుర్తించాలంటే..
ఓరీ దేవుడో.. మనం వాడుతున్న పసుపు నకిలీదా..? ఎలా గుర్తించాలంటే..
రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్ మారాయ్.. కొత్త మార్పులు ఇవే..
రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్ మారాయ్.. కొత్త మార్పులు ఇవే..
హీరోయిన్ సంఘవి కూతురును చూశారా? బర్త్ డే ఫొటోస్ వైరల్
హీరోయిన్ సంఘవి కూతురును చూశారా? బర్త్ డే ఫొటోస్ వైరల్
సంక్రాంతికి నాలుగు గ్రహాల సందడి..ఈ రాశుల వారికి కనక వర్షం ఖాయం..!
సంక్రాంతికి నాలుగు గ్రహాల సందడి..ఈ రాశుల వారికి కనక వర్షం ఖాయం..!
సూర్య దోషం.. సంక్రాంతి నాడు ఇలా చేస్తే దోషం పోయి శుభ ఫలితాలు
సూర్య దోషం.. సంక్రాంతి నాడు ఇలా చేస్తే దోషం పోయి శుభ ఫలితాలు
లేఆఫ్‌లో జాబ్‌ పోయినా? మీ పీఎఫ్‌ డబ్బుకు వడ్డీ వస్తుందా?
లేఆఫ్‌లో జాబ్‌ పోయినా? మీ పీఎఫ్‌ డబ్బుకు వడ్డీ వస్తుందా?
ఫిబ్రవరి 1న బడ్జెట్‌.. స్టాక్‌ మార్కెట్‌ ఓపెన్‌ ఉంటుందా?
ఫిబ్రవరి 1న బడ్జెట్‌.. స్టాక్‌ మార్కెట్‌ ఓపెన్‌ ఉంటుందా?
ఇంట్లో చెత్త బుట్ట ఎక్కడ పెడుతున్నారు? ఈ తప్పులు చేశారంటే నాశనమే!
ఇంట్లో చెత్త బుట్ట ఎక్కడ పెడుతున్నారు? ఈ తప్పులు చేశారంటే నాశనమే!
శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం
శబరిమలలో మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం
ప్రయాణికులతో కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్
ప్రయాణికులతో కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్