AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోరు జారిన బీజేపీ నేత.. కేంద్రమంత్రి ఫైర్

పశ్చిమ బెంగాల్ బిజెపి చీఫ్ దిలీప్ ఘోష్ ప్రజా ఆస్తులను దెబ్బతీసేవారిని “కుక్కల వలె కాల్చి చంపాలి” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోని నాడియా జిల్లాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో దిలీప్ ఘోష్ పై వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది డిసెంబర్‌లో రాష్ట్రంలో జరిగిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిరసనల సందర్భంగా రైల్వే ఆస్తులను, […]

నోరు జారిన బీజేపీ నేత.. కేంద్రమంత్రి ఫైర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 13, 2020 | 6:05 PM

Share

పశ్చిమ బెంగాల్ బిజెపి చీఫ్ దిలీప్ ఘోష్ ప్రజా ఆస్తులను దెబ్బతీసేవారిని “కుక్కల వలె కాల్చి చంపాలి” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోని నాడియా జిల్లాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో దిలీప్ ఘోష్ పై వ్యాఖ్యలు చేశారు.

గత ఏడాది డిసెంబర్‌లో రాష్ట్రంలో జరిగిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిరసనల సందర్భంగా రైల్వే ఆస్తులను, ప్రజా రవాణాను నాశనం చేస్తున్న వారిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాల్పులు జరపడం, లాఠీచార్జ్ చేయమని ఆదేశించలేదు అని ఘోష్ విమర్శించారు.

“దీదీ (మమతా బెనర్జీ) పోలీసులు ఆమె ఓటర్లు కావడంతో ప్రజా ఆస్తులను నాశనం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోలేదు. ఉత్తర ప్రదేశ్, అస్సాం, కర్ణాటకలోని మా ప్రభుత్వాలు ఈ వ్యక్తులను కుక్కల్లా కాల్చాయి ”అని బిజెపి సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. బిజెపి నేత ఉపయోగించే భాష ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదంటూ కాంగ్రెస్ నేత దినేష్ ఆరోపించారు.

గత ఏడాది డిసెంబర్‌లో సవరించిన పౌరసత్వ చట్టంపై పశ్చిమ బెంగాల్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు చెలరేగాయి. బిజెపి నేతృత్వంలోని కేంద్రం ముస్లింలపై వివక్ష చూపిస్తోందని ప్రతిపక్షాల నేతలు ఆరోపించారు.

Follow Us