మహారాష్ట్రలో 2,061 మంది ఖైదీలకు కరోనా
దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో అంతే తీవ్రత కొనసాగుతుంది. మహారాష్ట్రలోని జైళ్లలో 2,061 మంది ఖైదీలు, 421 మంది జైలు సిబ్బందికి కరోనా సోకిందని జైళ్ల శాఖ తాజాగా వెల్లడించింది.
దేశంలో కరోనా కల్లోలానికి ఫ్రంట్ వారియర్స్ సైతం విలవిలలాడుతున్నారు. జనం ప్రాణాల కోసం కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్న పోలీసులు కరోనా వైరస్ కాటుకు బలవుతున్నారు. మరోవైపు జైలులో ఉంటున్న ఖైదీలు కూడా కొవిడ్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో అంతే తీవ్రత కొనసాగుతుంది. మహారాష్ట్రలోని జైళ్లలో 2,061 మంది ఖైదీలు, 421 మంది జైలు సిబ్బందికి కరోనా సోకిందని జైళ్ల శాఖ తాజాగా వెల్లడించింది. కాగా, ఇందులో ఆరుగురు ఖైదీలు, ఐదుగురు జైలు సిబ్బది కరోనాతో మరణించారు. పూణే నగరంలోని ఎరవాడ సెంట్రల్ జైలులో అత్యధికంగా 261 మంది ఖైదీలు, 43 మంది జైలు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మొత్తంగా మహారాష్ట్రలో ఇప్పటి వరకు 1,767 మంది ఖైదీలు, 372 మంది జైలు సిబ్బంది కరోనా నుంచి కోలుకున్నారు. మరోవైపు మహారాష్ట్రలో 2,73,477 మందికి కరోనా సోకగా,వారిలో 33,886 మంది మరణించారు.