AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీలో ఇద్ద‌రు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు

ఉత్తరప్రదేశ్ : పుల్వామా ఘటనతో దేశ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం వేటకోనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ లోని శరన్ పూర్ జిల్లాలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను యూపీ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. వీరు జైషేమహ్మద్ కు సానుభూతిపరులుగా గుర్తించింది. వీరు విద్యార్ధులుగా నటిస్తూ.. ఉగ్రవాదంలోకి యువతను ఆకర్షిస్తున్నారు. అరెస్టు అయిన ఇద్దరిని ష‌హ‌న‌వాజ్ తెలి, అకిబ్ అహ్మ‌ద్ మాలిక్‌గా గుర్తించారు. షహన్ వాజ్ కుల్గామ్ జిల్లాకు, మాలిక్‌ పుల్వామా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. దియోబంద్‌లోని ఓ విద్యార్థి ఇచ్చిన […]

యూపీలో ఇద్ద‌రు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 5:39 PM

Share

ఉత్తరప్రదేశ్ : పుల్వామా ఘటనతో దేశ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం వేటకోనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ లోని శరన్ పూర్ జిల్లాలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను యూపీ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. వీరు జైషేమహ్మద్ కు సానుభూతిపరులుగా గుర్తించింది. వీరు విద్యార్ధులుగా నటిస్తూ.. ఉగ్రవాదంలోకి యువతను ఆకర్షిస్తున్నారు. అరెస్టు అయిన ఇద్దరిని ష‌హ‌న‌వాజ్ తెలి, అకిబ్ అహ్మ‌ద్ మాలిక్‌గా గుర్తించారు. షహన్ వాజ్ కుల్గామ్ జిల్లాకు, మాలిక్‌ పుల్వామా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. దియోబంద్‌లోని ఓ విద్యార్థి ఇచ్చిన స‌మాచారం మేర‌కు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్ద‌రి నుంచి రెండు 32 బోర్ రివాల్వర్లు, 30 లైవ్ కాట్రిడ్జ్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల మొబైల్ ఫోన్ల‌లో జిహాదీ చాట్‌, వీడియో, ఫోటోల‌ను పోలీసులు గుర్తించారు. ఈ ఇద్ద‌రూ జైషే కోసం కొత్త రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.