AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వాలు మారుతున్నాయ్..పాఠశాలలు మారవా..?

పాఠశాలలు రేపటి దేశ భవిష్యత్‌కు దివిటీలు లాంటివి. ఒక విద్యార్థికి ప్రాథమిక విలువలు నేర్చుకునేది ఇక్కడే. అతడు ఏ గమ్యం వైపు వెళ్లాలి..ఎటువంటి కెరీర్‌ను ఎంచుకోవాలి అనే అంశాలన్నీంటికి ఇక్కడే రూట్స్ మొదలవుతాయి. పాఠశాల విద్య వ్యక్తులపై, సమాజంపై ఊహించని ప్రభావం చూపుతుంది.  ఇంతలా విద్యార్థలును తీర్చిదిద్దే పాఠశాలలు.. ప్రభుత్వాలు మారుతున్నా వాటి రూపురేఖలను మాత్రం మార్చుకోలేకపోతున్నాయి. నేతలు ఎన్నికల్లో హామీలు తప్ప..ఆ తర్వాత ఐదేళ్లు వాటిని పట్టించుకునే నాథుడే కనిపించడం లేదరు. ఇక ఏజెన్సీలో పాఠశాలల […]

ప్రభుత్వాలు మారుతున్నాయ్..పాఠశాలలు మారవా..?
Ram Naramaneni
| Edited By: |

Updated on: Nov 08, 2019 | 1:00 PM

Share

పాఠశాలలు రేపటి దేశ భవిష్యత్‌కు దివిటీలు లాంటివి. ఒక విద్యార్థికి ప్రాథమిక విలువలు నేర్చుకునేది ఇక్కడే. అతడు ఏ గమ్యం వైపు వెళ్లాలి..ఎటువంటి కెరీర్‌ను ఎంచుకోవాలి అనే అంశాలన్నీంటికి ఇక్కడే రూట్స్ మొదలవుతాయి. పాఠశాల విద్య వ్యక్తులపై, సమాజంపై ఊహించని ప్రభావం చూపుతుంది.  ఇంతలా విద్యార్థలును తీర్చిదిద్దే పాఠశాలలు.. ప్రభుత్వాలు మారుతున్నా వాటి రూపురేఖలను మాత్రం మార్చుకోలేకపోతున్నాయి. నేతలు ఎన్నికల్లో హామీలు తప్ప..ఆ తర్వాత ఐదేళ్లు వాటిని పట్టించుకునే నాథుడే కనిపించడం లేదరు. ఇక ఏజెన్సీలో పాఠశాలల పరిస్థితి వర్ణణాతీతంగా తయారైంది. అక్కడి విద్యను నేర్చుకునే ప్రథమిక హక్కును కూడా కోల్పోయే ప్రమాదంలోకి కనీస సౌకర్యాలు, వసతులు లేని పాఠశాలలు నెట్టివేసేలా కనిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో దయనీయంగా మారిన పాఠశాలల పై టివి9 స్పెషల్ ఫోకస్..

విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు.. ప్రభుత్వ ట్రైబుల్ వెల్ఫర్ పరిధిలో ఉంటాయి.. వీటి పరిస్థితి ప్రస్తుతం దుర్భరంగా తయారైంది. వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది పాచిపెంట ప్రభుత్వ ట్రైబుల్ వేల్ఫర్ పాఠశాల.. ఇక్కడ పిల్లలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. ఈ ఆశ్రమ పాఠశాలలో మూడవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు 205 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటారు. ఈ స్కూల్ పెద్ద గెడ్డ రిజర్వాయర్ దగ్గరలో ఉంటుంది.. స్కూల్ ప్రారంభం నుండి ఇక్కడ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు..

స్కూల్ బిల్డింగ్స్ సరిగా లేక ఉపాధ్యాయులు ఆరుబయట వరండాలలో చదువు చెబుతుంటారు. అంతేకాక స్కూల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో..ఎటువైపు నుంచి పెచ్చులు ఊడి మీద పడతాయో అని విద్యార్థులు నిత్యం భయంతో క్లాసులు వినాల్సిందే. మరోవైపు సరైన వెంటిలేషన్ సదుపాయం లేకపోవటంతో.. చదువుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాక, ఆక్సిజన్ అందకపోవటంతో స్టూడెంట్స్ నానా అవస్థలు పడుతున్నారు. అక్కడ అడుగు పెట్టగానే.. చిమ్మ చీకటిలో బోర్డుపై విద్యను బోధిస్తున్న ఉపాద్యాయులు కనిపిస్తుంటారు..వాటిని తడిమి తడిమి చూసుకోని నోట్ చేసుకుంటున్న విద్యార్థలు మనకు తారసపడతారు.  వర్షాకాలంలో పాఠశాల ఉన్న ప్రాంతం ముంపుకు గురవుతూ ఉంటుంది.  ఇక అదే సమయంలో కరెంట్ వైరింగ్ సరిగ్గా లేక.. విద్యుత్ షాక్‌కు గురి అవుతున్నాం అని విద్యార్థులు వాపోతున్నారు.  స్కూల్,  హాస్టల్ ఒకదగ్గరే అవటం వలన హాస్టల్ వసతులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి.. పాఠశాల గదులు సరిగా లేకపోవడంతో హాస్టల్ రూములోనే కొన్నిసార్లు విద్యార్థులకు విద్యను భోధిస్తున్నారు ఉపాధ్యాయులు.. హాస్టల్ సరిపోక రాత్రి సమయాల్లో ఆరుబయట నిద్రిస్తున్న దయనియపరిస్థితి నెలకొంది.. చాలీ చాలని బాత్రూమ్ లు వుండటం తో పక్కనే వున్న పెద్ద గెడ్డ జలాశయానికి వెళ్లి ప్రమాదకరంగా కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు.

కేవలం ఈ ఒక్క పాఠశాల మాత్రమే కాదు..ఏజెన్సీలోనే ఇతర ఆశ్రమ పాఠశాలల్లో ఇంచుమించు ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులు సరైన దృష్టి పట్టించుకుంటే తప్ప..ఈ భావిభారత నిర్మాతల కష్టాలు తీరే పరిస్థితులు కన్పించడం లేదు.

Follow Us