తెలంగాణ : డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.600కోట్లు విడుదల
గ్రేటర్ హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు తెలంగాణ సర్కార్ నిధులు మంజూరు చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు తెలంగాణ సర్కార్ నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ.600 కోట్లను విడుదల చేస్తూ గృహనిర్మాణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో గవర్నమెంట్ రూ.3,750 కోట్లను కేటాయించింది. ఇందులో భాగంగా గతంలో రూ.150 కోట్లు రిలీజ్ చేయగా.. తాజాగా మరో రూ.600కోట్ల విడుదలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కాగా తెలంగాణ సర్కార్ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అర్హులైన పేదలకు పలుచోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేశారు. చాలా చోట్ల ఆ ఇళ్ల నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కోసం తాజాగా రూ. 600 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను బడ్జెట్ నిధుల నుంచి కేటాయించింది ప్రభుత్వం.
Also Read :
‘ఆంటీ’ అని పిలిచినందుకు వీర బాదుడు బాదింది