AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుప్రీంకు నలుగురు జడ్జిల నియామకానికి ఓకే..

సుప్రీంకోర్టుకు నలుగురు న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రపతి సంతకం అనంతరం దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఏ ఎస్ బోపన్న, జస్టిస్ బీ ఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందుతున్నారు. వీరి నియామకాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జస్టిస్ బోస్, జస్టిస్ బోపన్నలకు […]

సుప్రీంకు నలుగురు జడ్జిల నియామకానికి ఓకే..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 22, 2019 | 9:00 PM

Share

సుప్రీంకోర్టుకు నలుగురు న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రపతి సంతకం అనంతరం దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఏ ఎస్ బోపన్న, జస్టిస్ బీ ఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందుతున్నారు. వీరి నియామకాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

జస్టిస్ బోస్, జస్టిస్ బోపన్నలకు పదోన్నతి కల్పించాలన్న కొలీజియం సిఫారసులను గతంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. వీరి సీనియారిటీ, ప్రాంతీయతలను కారణాలుగా చూపుతూ అభ్యంతరం వ్యక్తం చేసింది.

జస్టిస్ బోస్ జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ, జస్టిస్ బోపన్న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ పనిచేస్తున్నారు. జస్టిస్ గవాయ్ బోంబే హైకోర్టు జడ్జిగానూ, జస్టిస్ కాంత్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ పని చేస్తున్నారు.

సుప్రీంకోర్టులో మొత్తం 31 మంది జడ్జిలను నియమించేందుకు అనుమతి ఉంది. ప్రధాన న్యాయమూర్తితో సహా 31 మంది న్యాయమూర్తులు ఉండాలి. ఇప్పటి వరకు 27 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. తాజాగా నలుగురిని నియమిస్తే అనుమతి ఉన్న సంఖ్యలో న్యాయమూర్తులను నియమించినట్లవుతుంది.

Follow Us
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు