AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి హుండీ ఆదాయం రూ. 69 లక్షలు..

కరోనా విరామం తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా వస్తున్నారు. నిన్న తిరుమలేశుడి హుండీ ఆదాయం రూ.69.60 లక్షలు వచ్చింది.

శ్రీవారి హుండీ ఆదాయం రూ. 69 లక్షలు..
Ravi Kiran
|

Updated on: Sep 17, 2020 | 9:09 AM

Share

కరోనా విరామం తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా వస్తున్నారు. నిన్న తిరుమలేశుడి హుండీ ఆదాయం రూ.69.60 లక్షలు వచ్చింది. బుధవారం సాయంత్రం వరకు 13,351 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 4,432 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ వెల్లడించింది. కాగా, ఇవాళ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈ నెల 19 నుంచి 27 వరకు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. చివరిగా ఈ నెల 23న గరుడ వాహన సేవ జరుగుతుంది. ఈ సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. (Tirumala Srivari Hundi Income)

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!