వాయుగుండంగా మారిన అల్పపీడనం..తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

హైదరాబాద్‌: ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయు గుండంగా మారిందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతం వద్ద ఒడిశాకు ఆగ్నేయ దిశగా 160కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఇది రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని […]

వాయుగుండంగా మారిన అల్పపీడనం..తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
Follow us

|

Updated on: Aug 06, 2019 | 6:07 PM

హైదరాబాద్‌: ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయు గుండంగా మారిందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతం వద్ద ఒడిశాకు ఆగ్నేయ దిశగా 160కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. ఇది రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని.. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఈ మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రేపు రాష్ట్రంలోని పలు చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే మంగళ, బుధవారాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈరోజు కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలోని చాలా చోట్ల వర్షం పడే అవకాశం ఉందన్నారు.