AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్‌పై సుశీల్ మోదీ పరువు నష్టం దావా

పాట్నా : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ మోదీ పరువు నష్టం దావా వేశారు. ఇవాళ పాట్నా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో రాహుల్ గాంధీపై క్రిమినల్ కంప్లయింట్ దాఖలు చేశారు. మోదీ అనే ఇంటి పేరు ఉన్నవారిని రాహుల్ అవమానించారని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 13న మహారాష్ట్రలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. […]

రాహుల్‌పై సుశీల్ మోదీ పరువు నష్టం దావా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 18, 2019 | 7:57 PM

Share

పాట్నా : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ మోదీ పరువు నష్టం దావా వేశారు. ఇవాళ పాట్నా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో రాహుల్ గాంధీపై క్రిమినల్ కంప్లయింట్ దాఖలు చేశారు. మోదీ అనే ఇంటి పేరు ఉన్నవారిని రాహుల్ అవమానించారని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 13న మహారాష్ట్రలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మోదీ అనే ఇంటి పేరుగలవారందరి పరువు, ప్రతిష్ఠలకు విఘాతం కలిగేలా రాహుల్ గాంధీ మాట్లాడారని ఆరోపించారు.