AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గెహ్లాట్ కి ఊరట, 6 గురు ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనవచ్ఛు, సుప్రీంకోర్టు

రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. రేపు రాష్ట్ర అసెంబ్లీలో ఆయన బల పరీక్ష జరిగితే ఓటింగ్ లో ఆరుగురు మాజీ బీఎస్పీ ఎమ్మెల్యేలు..

గెహ్లాట్ కి ఊరట, 6 గురు ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనవచ్ఛు, సుప్రీంకోర్టు
Umakanth Rao
| Edited By: |

Updated on: Aug 13, 2020 | 4:08 PM

Share

రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కి సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. రేపు రాష్ట్ర అసెంబ్లీలో ఆయన బల పరీక్ష జరిగితే ఓటింగ్ లో ఆరుగురు మాజీ బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొనగలుగుతారు. కాంగ్రెస్ పార్టీలో వీరి విలీనంపై తాత్కాలిక స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ని విచారించిన కోర్టు అందుకు తిరస్కరించింది. అయితే తుది నిర్ణయాన్ని రాజస్థాన్ లోని సింగిల్ జడ్జి కోర్టుకే వదిలివేసింది. రాష్ట్ర హైకోర్టు ఇదివరకే ఈ పిటిషన్ ని విచారిస్తున్నందున ఈ దశలో తాము జోక్యం చేసుకోజాలమని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.

కాంగ్రెస్ పార్టీలో ఈ ఆరుగురు ఎమ్మెల్యేల విలీనాన్ని బహుజన్ సమాజ్ పార్టీ, బీజేపీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. శాసన సభలో ఫ్లోర్ టెస్ట్ జరిగినప్పుడు వీరి ఓటింగ్ గెహ్లాట్ కి చాలా కీలకం. అటు-గురువారం సాయంత్రం అయిదు గంటలకు రాజస్థాన్ సీఎల్ఫీ మీట్ కానుంది. ఆ సమావేశంలో గెహ్లాట్, అసమ్మతి నేత సచిన్ పైలట్ ముఖాముఖి కలుసుకోనున్నారు.

అవిశ్వాస తీర్మానం పెట్టనున్న బీజేపీ

రాజస్తాన్ అసెంబ్లీలో గెహ్లాట్ ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని బీజేపీ ప్రకటించింది. ఈ పార్టీ నేతలు వసుంధరా రాజే సింధియా, రాజస్థాన్ పార్టీ నాయకులు ఈ ఉదయం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ మిత్ర పక్షాలతో కలిసి రేపు శాసన సభలో గెహ్లాట్ సర్కార్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా తెలిపారు. మా వ్యూహాన్ని మార్చుకున్నామని, కాంగ్రెస్ పార్టీలో రెండు  వర్గాల మధ్య సయోధ్య కుదిరినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లూ అధికారంలో ఉండజాలదని ఆయన చెప్పారు.