ఆదివారం ప్రత్యేక రైళ్లు

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షరేపు (ఆదివారం) జరుగనున్న నేప‌థ్యంలో అభ్య‌ర్థుల సౌక‌ర్యార్థం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఢిల్లీ మెట్రో రైలు స‌ర్వీసులు ఉద‌యం 6 గంట‌ల‌కే ప్రారంభం కానున్నాయి. టెర్మిన‌ల్ స్టేష‌న్స్‌లోని అన్ని మార్గాల నుండి మెట్రో రైలు సర్వీసులు ఉద‌యం 6 గంట‌ల‌కే ప్రారంభం కానున్న‌ట్లు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేష‌న్ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలియ‌జేసింది. సివిల్స్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థుల‌కు డీఎంఆర్‌సీతో పాటు […]

ఆదివారం ప్రత్యేక రైళ్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 03, 2020 | 9:26 PM

సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షరేపు (ఆదివారం) జరుగనున్న నేప‌థ్యంలో అభ్య‌ర్థుల సౌక‌ర్యార్థం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఢిల్లీ మెట్రో రైలు స‌ర్వీసులు ఉద‌యం 6 గంట‌ల‌కే ప్రారంభం కానున్నాయి. టెర్మిన‌ల్ స్టేష‌న్స్‌లోని అన్ని మార్గాల నుండి మెట్రో రైలు సర్వీసులు ఉద‌యం 6 గంట‌ల‌కే ప్రారంభం కానున్న‌ట్లు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేష‌న్ త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలియ‌జేసింది. సివిల్స్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థుల‌కు డీఎంఆర్‌సీతో పాటు సౌత్ వెస్ట్రన్ రైల్వే త‌న సేవ‌ల‌ను అందిస్తుంది. వాయువ్య కర్ణాటకలోని హుబ్లీ నుండి బెంగళూరు వరకు ప్రత్యేక రైలును నడుపుతుంది. అదేవిధంగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సైతం రెండు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌డ‌ప నుండి అనంత‌పురం, క‌ర్నూలు నుంచి అనంత‌పురం వ‌ర‌కు రైళ్ల‌ను న‌డుపుతారు. అయితే, అభ్యర్థులు కచ్చితంగా కొవిడ్ జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు జరపాలని రైల్వే శాఖ కోరింది.

అఖిల భారత సర్వీసుల నియామకాల కోసం నిర్వ‌హించే సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వాయిదా వేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30న తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దీంతో యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(యూపీఎస్‌సీ) రేపు (అక్టోబ‌ర్ 4)వ తేదీనే సివిల్ స‌ర్వీసెస్ ఎగ్జామ్‌ను నిర్వ‌హించ‌నుంది. కోవిడ్‌-19 మ‌హమ్మారి.. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో సంభ‌వించిన‌ వరదలను దృష్టిలో ఉంచుకుని 20 మంది సివిల్ సర్వీస్ అభ్య‌ర్థుల‌ బృందం పరీక్ష వాయిదా కోరుతూ దాఖలు చేసిన అభ్యర్థనను సుప్రీం తిరస్కరిస్తూ పరీక్ష నిర్వహణకు మార్గం సుగమం చేసిన సంగతి తెలిసిందే.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?