AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ రోజున ‘నేనొక్కడినే’

ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీలో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ మేరకు జగన్ స్పష్టం చేశారు. ప్రమాణస్వీకారం జరిగిన తర్వాత వారం పది రోజుల్లో కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని తెలిపారు. ఈనెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. జగన్ ప్రమాణస్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి […]

ఆ రోజున 'నేనొక్కడినే'
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 26, 2019 | 3:40 PM

Share

ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీలో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ మేరకు జగన్ స్పష్టం చేశారు. ప్రమాణస్వీకారం జరిగిన తర్వాత వారం పది రోజుల్లో కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని తెలిపారు. ఈనెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. జగన్ ప్రమాణస్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకానున్నారు.

విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 50వేల మందికి పైగా కూర్చొనే వెసులుబాటు ఉండటంతో ఈ మేరకు అక్కడే ప్రమాణస్వీకారోత్సవం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రమణ్యం నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది.