AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌.. తేలనున్న 4,023 మంది అభ్యర్థుల భవితవ్యం

తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని నిర్ణయించే 2026 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు, గురువారం ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 7 గంటలకు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. ప్రస్తుత ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) నేతృత్వంలోని లౌకిక సంకీర్ణ ప్రభుత్వ పదవీకాలం మే 7తో ముగియనున్న నేపథ్యంలో, ఈ ఎన్నికలు అటు అధికార పక్షానికి, ఇటు ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.

Tamil Nadu: కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌.. తేలనున్న 4,023 మంది అభ్యర్థుల భవితవ్యం
Tamil Nadu Assembly Election 2026
Balaraju Goud
|

Updated on: Apr 23, 2026 | 8:28 AM

Share

తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని నిర్ణయించే 2026 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు, గురువారం ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 7 గంటలకు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. ప్రస్తుత ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) నేతృత్వంలోని లౌకిక సంకీర్ణ ప్రభుత్వ పదవీకాలం మే 7తో ముగియనున్న నేపథ్యంలో, ఈ ఎన్నికలు అటు అధికార పక్షానికి, ఇటు ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.

ఈసారి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుండి మొత్తం 4,023 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో పురుష అభ్యర్థులు 3,585 మంది, మహిళా అభ్యర్థులు 438 మంది బరిలోకి దిగారు. ప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు మరియు స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించారు. నేడు ఓటర్లు ఇచ్చే తీర్పుతోనే ఈ అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తు తేలనుంది.

తమిళనాడు ఓటర్ల జాబితా పరిశీలిస్తే, మహిళా ఓటర్ల ప్రాబల్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 5 కోట్ల 73 లక్షల 43 వేల 291 మంది ఓటర్లు ఈ ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కానున్నారు. దీనికి సంబంధించిన వర్గీకరణ పరిశీలిస్తే, మహిళా ఓటర్లు – 2,93,04,905, పురుష ఓటర్లు 2,80,30,658 మంది, ఇక ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 7,728 మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పురుషుల కంటే మహిళా ఓటర్లే సుమారు 13 లక్షల మంది ఎక్కువగా ఉండటం ఈ ఎన్నికల్లో విశేషం. సంక్షేమ పథకాలు, ధరల పెరుగుదల, స్థానిక సమస్యలే ప్రధాన అజెండాగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

తమిళనాడులోని ఓటర్లందరూ అత్యంత ఉత్సాహంగా ఓటు వేయాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ఓటు వేస్తున్న తరుణంలో, ప్రజాస్వామ్యమనే ఈ పవిత్ర కర్తవ్యంలో ఓటర్లందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు. ముఖ్యంగా తమిళనాడు యువత, మహిళలు రికార్డు స్థాయిలో ఓటు వేయడానికి ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

చెన్నై మొదలుకుని కన్యాకుమారి వరకు ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మే 7తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో, ఫలితాల అనంతరం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. శాంతియుత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. తమిళనాడు ఓటరు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us