AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వచ్చే ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే.!

కరోనా కారణంగా ఈ సీజన్‌ ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించిన బీసీసీఐ.. వచ్చే ఏడాది మెగా ఈవెంట్‌ను మాత్రం భారత్‌లోనే నిర్వహిస్తామని తెలిపింది.

వచ్చే ఏడాది ఐపీఎల్ ఇండియాలోనే.!
Ravi Kiran
|

Updated on: Nov 08, 2020 | 3:18 PM

Share

IPL 2021: ఐపీఎల్ 2020 చివరి దశకు చేరుకుంది. ఇంకో రెండు మ్యాచ్‌లతో ఈ సీజన్ విజయవంతంగా పూర్తి కానుంది. కరోనా కారణంగా ఈ సీజన్‌ ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించిన బీసీసీఐ.. వచ్చే ఏడాది మెగా ఈవెంట్‌ను మాత్రం భారత్‌లోనే నిర్వహిస్తామని తెలిపింది. ఏప్రిల్, మే నెలల్లో ఐపీఎల్ 2021ని జరుపుతామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు.

అలాగే రెండు, మూడేళ్లలో మహిళల టీ20లలోనూ ఎనిమిది జట్లను తీసుకొస్తామని పేర్కొన్నాడు. రంజీ ట్రోఫీ కోసం బయోబబుల్‌ను ఏర్పాటు చేస్తామని.. దేశవాళీ టోర్నీలన్నీ కూడా భారత్‌లోనే నిర్వహిస్తామని గంగూలీ తెలిపాడు. అటు వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జరగనున్న సిరీస్‌కు భారత్ అతిధ్యమిస్తుందని అన్నాడు.

Also Read:

ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? పరిశోధనకు ఆదేశించిన టీటీడీ.!

జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..

ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ

అక్కడ డిసెంబర్ 31 వరకు స్కూల్స్ మూసివేత..

మళ్లీ స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. ఈసారి రిప్లై అదుర్స్.!

ఆ పాస్టర్లపై చర్యలు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం

బిగ్ బాస్ 4: హౌస్ నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్..!