AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌‌లో.. 16 మంది ఆటగాళ్లకు కరోనా..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే మూడు నెలలకు పైగా అన్ని క్రీడా ఈవెంట్లు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే పలు క్రీడా సంఘాలు

నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌‌లో.. 16 మంది ఆటగాళ్లకు కరోనా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 27, 2020 | 1:54 PM

Share

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే మూడు నెలలకు పైగా అన్ని క్రీడా ఈవెంట్లు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే పలు క్రీడా సంఘాలు, సమాఖ్యలు ఆటలను పునఃప్రారంభించాలని ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా ఆటగాళ్లకు నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో పలువురు వైరస్‌ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కొందరు టెన్నిస్‌ ప్రముఖులతో పాటు 10మంది పాకిస్థాన్‌ క్రికెటర్లు సైతం ఈ మహమ్మారి బారినపడిన సంగతి తెలిసిందే.

అమెరికాలో కరోనా వీరవిహారం చేస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌(ఎన్‌బీఏ)లోనూ 16 మంది ఆటగాళ్లు వైరస్‌ బారిన పడ్డారు. ఈనెల 23న మొత్తం 302 మంది ఆటగాళ్లకు నిర్వహించిన పరీక్షల్లో ఇంత మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని ఆ సంఘం వెల్లడించింది. అయితే, వారి పేర్లను మాత్రం బయటకు చెప్పలేదు. అలాగే వచ్చేనెల 30 నుంచి ఫ్లోరిడాలోని డిస్నీ వరల్డ్‌లో కొత్త సీజన్‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పింది. ఎన్‌బీఏలో మొత్తం 30 జట్లు ఉండగా, 22 టీమ్‌లనే ఆడించాలనుకుంటున్నట్లు తెలిపింది.

Follow Us