AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్న పిల్లల కోసం తల్లి ఆరాటం..

తన కన్న పిల్లల కోసం ఆ తల్లి పడుతున్న ఆరాటం సగం ఫలించింది. అత్తింటి వేధింపులు భరించలేక మీడియా ముందుకొచ్చిన సింధు పోరాటం కొనసాగుతోంది. ఇద్దరు పిల్లల్ని అప్పగించాలంటున్న ఆమెకు మహిళా సంఘాలు మద్దతు పలకడంతో.. ఉదయం నుంచి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. సాయంత్రం వరకు కొనసాగిన నిరసన దీక్షకు అత్తింటి వారు దిగివచ్చారు. ఇద్దరు పిల్లల్లో చిన్నపాపను అప్పగించారు. పెద్దపాపను కాసేపు తనతో ఉండేందుకు కూడా అంగీకరించలేదని.. తన న్యాయపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. […]

కన్న పిల్లల కోసం తల్లి ఆరాటం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 28, 2019 | 9:45 PM

Share

తన కన్న పిల్లల కోసం ఆ తల్లి పడుతున్న ఆరాటం సగం ఫలించింది. అత్తింటి వేధింపులు భరించలేక మీడియా ముందుకొచ్చిన సింధు పోరాటం కొనసాగుతోంది. ఇద్దరు పిల్లల్ని అప్పగించాలంటున్న ఆమెకు మహిళా సంఘాలు మద్దతు పలకడంతో.. ఉదయం నుంచి ఇంటి ముందు ధర్నా చేపట్టింది. సాయంత్రం వరకు కొనసాగిన నిరసన దీక్షకు అత్తింటి వారు దిగివచ్చారు. ఇద్దరు పిల్లల్లో చిన్నపాపను అప్పగించారు. పెద్దపాపను కాసేపు తనతో ఉండేందుకు కూడా అంగీకరించలేదని.. తన న్యాయపోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఎన్నో కేసుల్లో న్యాయం చెప్పిన రిటైర్ట్ జస్టిస్ నూతి రామ్మోహన్ రావు, తన కోడలికి మాత్రం తీరని అన్యాయం చేస్తున్నాడని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. కట్నం తీసుకోవడం చట్టరిత్యా నేరమని సమాజాన్ని మేలు కొల్పాల్సిన ఆయన.. అదే కట్నం కోసం కొడుకు భార్యని చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తున్నాయి.

హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ నూతి రామ్మోహన్‌రావుపై కోడలు సింధూ శర్మ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం తన భర్త వశిష్ఠ, అత్త, మామ చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించింది. తనపై ఇంట్లో దాడి చేశారంటూ సింధూ కొన్ని ఫోటోలను కూడా బయటకు విడుదల చేసింద. ఆమె చేతికి మెడ మీద కొట్టిన గాయాలు ఫోటోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల వాతలు తేలిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అత్తమామతో పాటు, భర్త వశిష్ట తనపై దాడి చేశారని ఆ దాడికి సంబంధించిన గాయాలివే అంటూ సాక్షాలు చూపిస్తోంది.

కాగా, ఇప్పటికే రిటైర్డ్ జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు, అతని భార్యతో పాటు, సింధూ భర్త వశిష్టపైన సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 498ఏ, 406, 323 సెక్షన్లతో పాటు, డీపీ యాక్ట్ 4,6 సెక్షన్ల కింద కూడా సీసీఎస్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

సింధు, వశిష్టకి ఏడేళ్ల క్రితం పెళ్లైంది. రెండేళ్ల క్రితం నుంచి ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. దీంతో సింధూ పుట్టింట్లో ఉంటోంది. అయితే విశిష్ఠతో పాటు, తన మామ నూతి రామ్మోహన్‌రావు, అత్త వచ్చి పుట్టింట్లోనే తనపై దాడి చేశారని.. తీవ్రంగా గాయపడిన తనను వాళ్లే అపోలో ఆస్పత్రిలో చేర్చారని తెలిపింది.

Follow Us
పిల్లల కళ్ళకు ఆరోగ్యాన్నిచ్చే పల్లెటూరి దప్పళం..
పిల్లల కళ్ళకు ఆరోగ్యాన్నిచ్చే పల్లెటూరి దప్పళం..
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే ఏమౌతుందో తెలుసా? తయారీ వెనుక రహస్యం!
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే ఏమౌతుందో తెలుసా? తయారీ వెనుక రహస్యం!
బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..?
బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..?
నీ ఐడియా అదుర్స్.. ఏకంగా ట్రాక్టర్‌నే స్విమ్మింగ్‌ పూల్‌గా..
నీ ఐడియా అదుర్స్.. ఏకంగా ట్రాక్టర్‌నే స్విమ్మింగ్‌ పూల్‌గా..
పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
కుకీస్ చేసిన ఎన్టీఆర్.. పంపమని అడిగిన అభిమాని..
కుకీస్ చేసిన ఎన్టీఆర్.. పంపమని అడిగిన అభిమాని..
ఈ చేప రుచి అదుర్స్,కొరమీను,రావును మించిన పోషకాలు..ధర కూడా తక్కువే
ఈ చేప రుచి అదుర్స్,కొరమీను,రావును మించిన పోషకాలు..ధర కూడా తక్కువే
పౌర్ణమి సినిమాలో ప్రభాస్‌తో నటించింది ఈమేనా..!!
పౌర్ణమి సినిమాలో ప్రభాస్‌తో నటించింది ఈమేనా..!!
రోడ్డుపై మూటతో నిల్చున్న వ్యక్తి.. ఆటోను ఆపి డ్రైవర్‌ను పిలిచాడు
రోడ్డుపై మూటతో నిల్చున్న వ్యక్తి.. ఆటోను ఆపి డ్రైవర్‌ను పిలిచాడు
వీరికి గోల్డెన్ టైం స్టార్ట్.. జీవితాన్ని మార్చే శుభ సమయం ఇదే
వీరికి గోల్డెన్ టైం స్టార్ట్.. జీవితాన్ని మార్చే శుభ సమయం ఇదే