వ్యూస్ కోసం డెవిల్ క్రాబ్ తిని మృత్యువాత
డిజిటల్ యుగంలో ఒక క్లిక్ తో ఎంటర్టైన్మెంట్ దొరుకుతోంది. ఫోన్ స్క్రీన్ పై కొన్ని సెకన్ల పాటు కనిపించే షార్ట్స్ వీడియోలు కోట్లాది మందిని అలరిస్తున్నాయి. ఫిలిప్పీన్స్లో ఓ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ కొత్త కొత్త కాన్సెప్ట్ లతో వీడియోలు చేస్తూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆమెకు ఇన్స్టాలో రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే అజ్ఞానంతో ఆమె షూట్ చేసిన ఓ వీడియో ఆమె ప్రాణాలను బలి తీసుకుంది.
ఫిలిప్పీన్స్లో ప్రముఖ ఇన్ఫ్లూయెన్సర్ ఎమ్మా అమిట్ తన స్నేహితులతో కలిసి మడ అడవులకు వెళ్లింది. అక్కడ చిత్రీకరించిన వీడియోలో నత్తలను పీతలను పడుతూ సరదాగా గడిపింది. ఆ తర్వాత కుత కుత ఉడుకుతున్న కొబ్బరిపాలలో ఓ పీతను వేసి వండింది. రుచిని ఆస్వాదిస్తూ తానొక్కతే తింటూ ఎమ్మా వీడియో చిత్రీకరించి ఇన్స్టాలో అప్లోడ్ కూడా చేసింది. అయితే హఠాత్తుగా ఆ మరుసటి రోజు ఆమె తీవ్ర అనారోగ్యం పాలైంది. స్పృహ కోల్పోయి, పెదవులు ముదురు నీలం రంగులోకి మారాయి. స్నేహితులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఫిబ్రవరి 6న ఎమ్మా మృతిచెందింది. అధికారుల దర్యాప్తులో ఆమె విషపూరిత పీత ‘డెవిల్ క్రాబ్’ ను తిన్నట్టుగా తేలింది. ఆ పీతలను ‘టాక్సిక్ రీఫ్ క్రాబ్స్’ అని కూడా అంటారు.
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

