90 కి.మీ వేగంతో దూసుకొచ్చిన మృత్యువు!
అతివేగం.. అంతం చేస్తుంది! మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎదుటివారి నిర్లక్ష్యం మన ప్రాణాల మీదకు తెస్తుంది. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ఈ ఘోర ప్రమాదం చూస్తే మీ గుండె తరుక్కుపోతుంది. రోడ్డు పక్కన కష్టపడి కూరగాయలు అమ్ముకునే ఒక సామాన్యుడిని.. ఒక టాక్సీ డ్రైవర్ అతివేగం బలితీసుకుంది.
జైపూర్లోని బజాజ్ నగర్ ప్రాంతంలో ఫిబ్రవరి 12 గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గోపాల్పుర నుంచి దుర్గాపుర రైల్వేస్టేషన్ వైపు వెళ్తున్న ఒక టాక్సీ.. నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న కూరగాయల బండిని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. ఆ టాక్సీ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది. అక్కడ కూరగాయలు అమ్ముకుంటున్న 50 ఏళ్ల మహేష్ సైని కాళ్లపై నుంచి కారు దూసుకెళ్లింది. అనంతరం అక్కడే పార్క్ చేసి ఉన్న మూడు బైకులు, ఒక లోడింగ్ వాహనం కూడా నుజ్జునుజ్జయ్యాయి. తీవ్ర గాయాలపాలైన మహేష్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Follow Us
వైరల్ వీడియోలు
బంపర్ ఆఫర్.. నెలరోజులు అక్కడ బిర్యానీ ఫ్రీ..!
రోడ్డుపై మెరుస్తూ కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా
పాడేరులో అద్భుతం 'మినీ కాశ్మీర్'గా మారిన అరకు లోయ
సాగర తీరంలో అద్భుతం.. మూడు కాళ్లపై నిలబడే వింత చేప
ఇన్స్టా, FB అడిక్షన్.. ఆ యువతిలో మానసిక సమస్యలు!
హనుమంతుడి పూజలో మునిగిపోయిన వానరం..!
మృత్యువు అంచున నాగుపాము.. సీపీఆర్తో ప్రాణం పోసిన హోంగార్డ్

