90 కి.మీ వేగంతో దూసుకొచ్చిన మృత్యువు!
అతివేగం.. అంతం చేస్తుంది! మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎదుటివారి నిర్లక్ష్యం మన ప్రాణాల మీదకు తెస్తుంది. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన ఈ ఘోర ప్రమాదం చూస్తే మీ గుండె తరుక్కుపోతుంది. రోడ్డు పక్కన కష్టపడి కూరగాయలు అమ్ముకునే ఒక సామాన్యుడిని.. ఒక టాక్సీ డ్రైవర్ అతివేగం బలితీసుకుంది.
జైపూర్లోని బజాజ్ నగర్ ప్రాంతంలో ఫిబ్రవరి 12 గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గోపాల్పుర నుంచి దుర్గాపుర రైల్వేస్టేషన్ వైపు వెళ్తున్న ఒక టాక్సీ.. నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న కూరగాయల బండిని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. ఆ టాక్సీ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది. అక్కడ కూరగాయలు అమ్ముకుంటున్న 50 ఏళ్ల మహేష్ సైని కాళ్లపై నుంచి కారు దూసుకెళ్లింది. అనంతరం అక్కడే పార్క్ చేసి ఉన్న మూడు బైకులు, ఒక లోడింగ్ వాహనం కూడా నుజ్జునుజ్జయ్యాయి. తీవ్ర గాయాలపాలైన మహేష్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Follow Us
వైరల్ వీడియోలు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

