AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌!

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌!

Samatha J
|

Updated on: Feb 14, 2026 | 10:31 AM

Share

తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025 నుంచి 2028 వరకు అమలయ్యే ఇంజినీరింగ్ కాలేజీల ఫీజుల ఖరారు ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. గతంలో TAFRC సూచించిన భారీ పెంపును అమలు చేస్తే విద్యార్థులపై భారీ భారం పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ఈసారి ఫీజుల నిర్ణయంలో కీలక మార్పులు చేసింది. విద్యార్థులపై భారీ భారం పడకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

గతంలో టీఏఎఫ్‌ఆర్‌సీ (TAFRC) కొన్ని ప్రముఖ కాలేజీలకు 60 నుండి 70 శాతం వరకు ఫీజులు పెంచాలని ప్రతిపాదించింది. ఉదాహరణకు, సీబీఐటీ వంటి కాలేజీల్లో ఫీజు రూ. 1.65 లక్షల నుండి రూ. 2.23 లక్షలకు పెరుగుతుందని ప్రచారం జరిగింది. అయితే, మధ్యతరగతి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. కేవలం ఖర్చులనే కాకుండా.. విద్యా నాణ్యత, ప్లేస్‌మెంట్స్, ఎన్ఏఏసీ (NAAC) గ్రేడింగ్, ఎన్ఐఆర్ఎఫ్ (NIRF) ర్యాంకింగ్‌లను కొలమానాలుగా తీసుకోవాలని ఆదేశించారు. ఈ విధానాన్ని కోర్టు ద్వారా కూడా స్పష్టం చేయడంతో.. ఫీజుల ఖరారులో పెంపు కంటే నాణ్యతనే ప్రధాన ప్రమాణంగా తీసుకున్నట్లు సమాచారం. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 150కి పైగా ఇంజినీరింగ్ కాలేజీల్లో మెజారిటీ కాలేజీలకు పాత ఫీజులే యథాతథంగా కొనసాగనున్నాయి. కొన్ని కాలేజీలకు మాత్రమే 10 నుంచి 15 శాతం మేర స్వల్ప పెంపు ఉండవచ్చని తెలుస్తోంది.