పాక్ తో ఆడకుండా ఉంటే ఓటమి అంగీకరించినట్లే..
పాకిస్థాన్ తో క్రికెట్ ఆడకపోతే మనం ఆ దేశానికి లొంగిపోయినట్లే అని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశిథరూర్ అన్నారు. వరల్ట్ కప్ లో పాకిస్థాన్ తో భారత్ ఆడాలా వద్దా అన్నదానిపై చర్చ కొనసాగుతూనే ఉంది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలోనూ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో భారత్ ఆడి విజయం సాధించిందని శశిథరూర్ గుర్తు చేశారు. ఇప్పుడు భారత జట్టు పాక్తో ఆడకుండా ఉంటే అది వాళ్లకు లొంగిపోవడం కంటే దారుణమని.. […]

పాకిస్థాన్ తో క్రికెట్ ఆడకపోతే మనం ఆ దేశానికి లొంగిపోయినట్లే అని కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశిథరూర్ అన్నారు. వరల్ట్ కప్ లో పాకిస్థాన్ తో భారత్ ఆడాలా వద్దా అన్నదానిపై చర్చ కొనసాగుతూనే ఉంది. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలోనూ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో భారత్ ఆడి విజయం సాధించిందని శశిథరూర్ గుర్తు చేశారు. ఇప్పుడు భారత జట్టు పాక్తో ఆడకుండా ఉంటే అది వాళ్లకు లొంగిపోవడం కంటే దారుణమని.. ఇంకా చెప్పాలంటే పోరాటం చేయకుండానే ఓడిపోయినట్లు అవుతుందని థరూర్ అభిప్రాయపడ్డారు.
#WATCH Shashi Tharoor says, “In ‘1999 Kargil War, India played Pakistan in the cricket World Cup, & won. To forfeit the match this year would not just cost two points: it would be worse than a surrender, since it would be defeat without a fight.” pic.twitter.com/yRIExUVJ4c
— ANI (@ANI) February 22, 2019



