కరోనా బాధితులకు శుభవార్త..!
కరోనాపై యుద్దంలో మేముసైతం అంటూ ముందుకొచ్చారు రైల్వే శాఖ. వైద్య సిబ్బందికి సాయం అందించడానికి దక్షిణ మధ్య రైల్వే ఒక రోబోను అభివృద్ధి చేసింది. దీనికి రైల్బోట్(ఆర్-బోట్)గా నామకరణం చేశారు. ఇది వైద్యులకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందించడంలో సహయపడుతుందంటున్నారు రైల్వేఅధికారులు.
కరోనాపై యుద్దంలో మేముసైతం అంటూ ముందుకొచ్చారు రైల్వే శాఖ. వైద్య సిబ్బందికి సాయం అందించడానికి దక్షిణ మధ్య రైల్వే ఒక రోబోను అభివృద్ధి చేసింది. దీనికి రైల్బోట్(ఆర్-బోట్)గా నామకరణం చేశారు. ఇది వైద్యులకు అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందించడంలో సహయపడుతుందంటున్నారు రైల్వేఅధికారులు. కేవలం డాక్టర్లకు మాత్రమే కాకుండా కరోనా పేషెంట్లకు ఆహారాన్ని కూడా అందిస్తుంది. ఈ రోబోను వైఫై, మొబైల్ యాప్ ద్వారా ఆపరేట్ చెయ్యొచ్చు. యాప్ ద్వారా ఏం చేయాలో సూచనలు ఇస్తే చాలు ఈ రోబో వాటికి తగ్గట్టుగా పనిచేస్తుంది. అంతేకాదు శరీర ఉష్ణోగ్రతను కూడా నిర్థారిస్తుంది. ఎవరికైనా ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు ఉంటే రోబోకు అమర్చిన రెడ్ లైట్ తో అలర్ట్ చేస్తుంది. దీంతో ఆ వ్యక్తిని త్వరగా ఐసోలేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోబోకి అమర్చిన రియల్టైమ్ కెమెరా ద్వారా చుట్టూరా తిరుగుతూ పరిసరాలన్నింటిని రికార్డు చేస్తుంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
వీటితో పాటు ఈ రోబోకు ఉన్న మరికొన్ని ప్రత్యేకతలు:
* ఇందులో నైట్ ల్యాంప్, నైట్ విజన్ కెమెరాలు కూడా ఫిక్స్ చేశారు. * ఇది కరెంటు లేని ప్రదేశాల్లో కూడా సేవలను అందిస్తుంది. * ఇది గంటకు ఒక కిలోమీటర్ దూరం వెళ్లగలదు. * 80 కేజీల కంటే ఎక్కువ బరువును మోయగలదు. * ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 7 గంటల పాటు నిరవధికంగా పనిచేస్తుంది. * ఇది వ్యక్తులతో కూడా మాట్లాడుతుంది. * వ్యక్తుల మాల్ని, తన మాటల్ని కూడా రికార్డు చేస్తోంది. * రియల్టైమ్ కెమెరా సాయంతో రోబో ఎక్కడి వెళుతుందో తెలుసుకోవచ్చు.