AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తప్పైంది..క్షమించండి- సాధ్వి ప్రగ్యా సింగ్

ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన  ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేపై భోపాల్ బీజేపీ అభ్యర్ధి స్వాధ్వీ ప్రగ్యా సింగ్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన విషమం తెలిసిందే. దీంతో ఆమె తన వ్యాఖ్యలన్నీ వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపారు. తాను పొరపాటున నోరు జారానని, తన వ్యాఖ్యలపై బాధపడ్డ వారందరికి క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. ముంబయి దాడుల సమయంలో టెర్రరిస్టులతో పోరాడి ప్రాణాలు విడిచిన హేమంత్‌ కర్కరే అమరవీరుడని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. తాను చేసిన […]

తప్పైంది..క్షమించండి- సాధ్వి ప్రగ్యా సింగ్
Ram Naramaneni
|

Updated on: Apr 20, 2019 | 8:13 AM

Share

ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన  ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేపై భోపాల్ బీజేపీ అభ్యర్ధి స్వాధ్వీ ప్రగ్యా సింగ్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన విషమం తెలిసిందే. దీంతో ఆమె తన వ్యాఖ్యలన్నీ వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపారు. తాను పొరపాటున నోరు జారానని, తన వ్యాఖ్యలపై బాధపడ్డ వారందరికి క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. ముంబయి దాడుల సమయంలో టెర్రరిస్టులతో పోరాడి ప్రాణాలు విడిచిన హేమంత్‌ కర్కరే అమరవీరుడని ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. తాను చేసిన వ్యాఖ్యలు టెర్రరిస్టులకు ఆనందం కలిగించకూడదనే ఉద్దేశంతో తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు.

2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసు విచారణలో భాగంగా సాధ్వి ప్రగ్యా సింగ్ ను ముంబయి ఏటీఎస్ అరెస్టు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హేమంత్‌ కర్కరే.. పేలుళ్లలో వాడిన ద్విచక్ర వాహనం ప్రగ్యా పేరు మీదే నమోదై ఉందన్న ఆరోపణలతో ఆమెను అరెస్టు చేశారు. అయితే కేసు విచారణలో భాగంగా ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే తనను కస్టడీలో వేధింపులకు గురిచేశారని సాధ్వీ ప్రగ్యా ఆరోపించారు. తనపై వేధింపులకు పాల్పడిన కర్కరే సర్వ నాశనం అవ్వాలని శపించాను. సరిగ్గా అరెస్టు చేసిన 45 రోజులకు ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో హేమంత్ కర్కరే చనిపోయాడని ప్రగ్యా అన్నారు.