AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంకుల మూసివేస్తున్నారంటూ జోరుగా ప్రచారం… ఇంతకు RBI ఏమన్నదంటే..!!

హైద‌రాబాద్‌: బ్యాంకు సేవలు జనజీవనానికి ఎంతో అవసరం. మారుతున్న కాలానికి, పెరిగిన జనాభాకు సేవలు అందించడానికి ఇక మరిన్ని బ్యాంకుల శాఖలను నెలకొల్పాల్సి ఉంది. ఎంత డిజిటల్ బ్యాంకింగ్ వచ్చినప్పటికి భారత్ లాంటి అభివ‌ృద్ధి చెందుతున్న దేశంలో బ్యాంకులను కుదించడం మంచి పద్దతికాదని విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా 9 క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకుల‌ను మూసివేస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఇవాళ ఆర్బీఐ ఖండించింది. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్లో నిజంలేద‌ని ఆర్బీఐ చెప్పింది. అవ‌న్నీ త‌ప్పుడు వార్త‌లంటూ ఆర్బీఐ త‌న […]

బ్యాంకుల మూసివేస్తున్నారంటూ జోరుగా ప్రచారం... ఇంతకు RBI ఏమన్నదంటే..!!
Ram Naramaneni
| Edited By: |

Updated on: Sep 25, 2019 | 6:56 PM

Share

హైద‌రాబాద్‌: బ్యాంకు సేవలు జనజీవనానికి ఎంతో అవసరం. మారుతున్న కాలానికి, పెరిగిన జనాభాకు సేవలు అందించడానికి ఇక మరిన్ని బ్యాంకుల శాఖలను నెలకొల్పాల్సి ఉంది. ఎంత డిజిటల్ బ్యాంకింగ్ వచ్చినప్పటికి భారత్ లాంటి అభివ‌ృద్ధి చెందుతున్న దేశంలో బ్యాంకులను కుదించడం మంచి పద్దతికాదని విమర్శలు వినిపిస్తున్నాయి.

కాగా 9 క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకుల‌ను మూసివేస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఇవాళ ఆర్బీఐ ఖండించింది. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్లో నిజంలేద‌ని ఆర్బీఐ చెప్పింది. అవ‌న్నీ త‌ప్పుడు వార్త‌లంటూ ఆర్బీఐ త‌న ట్వీట్‌లో పేర్కొన్న‌ది. కొన్ని బ్యాంకుల‌ను మూసివేస్తున్న‌ట్లు వ‌స్తున్న ఊహాగానాల్లో నిజం లేద‌ని కూడా ఫైనాన్స్ సెక్ర‌ట‌రీ రాజీవ్ కుమార్ తెలిపారు. ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల‌ను మూసివేయ‌డంలేద‌న్నారు. క‌స్ట‌మ‌ర్ల‌కు ఉత్త‌మ‌మైన సేవ‌ల‌ను అందించేందుకు ప్ర‌భుత్వ‌మే ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల‌ను బ‌లోపేతం చేస్తుంద‌ని రాజీవ్ కుమార్ తెలిపారు.