ఏపీ సొమ్మును అంబానీకి కట్టబెట్టారు

ఏపీ ప్రజల సొమ్మును ప్రధాని మోదీ.. అంబానీకి దోచి పెడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షకు తన సంఘీభావాన్ని ప్రకటించిన రాహుల్.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ‘‘ఏపీ ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని పెడచెవిన పెట్టారు. మోదీకి విశ్వసనీయత లేదు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు. ఎక్కడికి వెళితే ఆయన అక్కడి పాటను పాడుతారు. ఈ దేశంలో ఏపీ భాగం కాదా..?’’ […]

ఏపీ సొమ్మును అంబానీకి కట్టబెట్టారు
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 9:02 PM

ఏపీ ప్రజల సొమ్మును ప్రధాని మోదీ.. అంబానీకి దోచి పెడుతున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షకు తన సంఘీభావాన్ని ప్రకటించిన రాహుల్.. ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ‘‘ఏపీ ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని పెడచెవిన పెట్టారు. మోదీకి విశ్వసనీయత లేదు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు. ఎక్కడికి వెళితే ఆయన అక్కడి పాటను పాడుతారు. ఈ దేశంలో ఏపీ భాగం కాదా..?’’ అంటూ రాహుల్ విమర్శించారు. ఏపీ ప్రజలకు అండగా ఉంటామని రాహుల్ మరోసారి హామీ ఇచ్చారు.