నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న ప్రధాని మోదీ.. 6.47 కోట్ల మంది ట్విట్టర్ ఫాలోవర్లతో మొదటి స్థానం
ప్రధానమంత్రి నరేంద్ర ట్విట్టర్లో మోదీ దూసుకుపోతున్నారు. ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రియాశీల రాజకీయ నాయకుల్లో ప్రధాని మోదీ టాప్ నెంబర్ వన్..
World’s Most Active Politician : ప్రధానమంత్రి నరేంద్ర ట్విట్టర్లో మోదీ దూసుకుపోతున్నారు. ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రియాశీల రాజకీయ నాయకుల్లో ప్రధాని మోదీ టాప్ నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 8.87 కోట్ల మంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండేవారు.
వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి అనంతరం ఆయన ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా తొలిగించింది. దీంతో ప్రధాని మోదీకి 6.47 కోట్ల మంది ట్విట్టర్ ఫాలోవర్లతో మొదటి స్థానంను దక్కించుకున్నారు.
క్రియాశీలంగా లేని రాజకీయ నేతల్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎవరికీ అందనంత ఎత్తులో కొనసాగుతున్నారు. ఒబామాకు 12.79 కోట్ల మంది ట్విట్టర్లో అనుసరిస్తున్నారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్కు ప్రస్తుతం 2.33 కోట్ల మంది ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
రూపాంతరం చెందుతున్న కరోనా స్ట్రెయిన్స్.. సౌతాఫ్రికా మ్యుటేషన్ కూడా దేశంలోకి ఎంట్రీ
Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు.. తొలిసారి 49,000 మార్క్ను తాకిన సెన్సెక్స్
సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ పిటిషన్ దాఖలు.. ఆధార్ చెల్లుబాటుపై ఇవాళ తీర్పు