సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ పిటిషన్ దాఖలు.. ఆధార్ చెల్లుబాటుపై ఇవాళ తీర్పు..
ఆధార్ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లను ఇవాళ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఆదాయపన్ను రిటర్నులు, పాన్కార్డు సహా వివిధ కార్యక్రమాలు, పథకాలకు..
Review Petitions Against Aadhaar : ఆధార్ చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లను ఇవాళ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఆదాయపన్ను రిటర్నులు, పాన్కార్డు సహా వివిధ కార్యక్రమాలు, పథకాలకు ఆధార్ అనుసంధానం చేయాలన్నకేంద్ర నిర్ణయంపై 2018లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం దీనిని విచారించింది.. ఈ రోజు తీర్పు వెలువరించనుంది.
ఐటీ రిటర్నులు, పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానం తప్పని సరిచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ 2018లో సుప్రీం తీర్పునిచ్చింది. అయితే బ్యాంకు ఖాతాలు, మొబైల్ కనెక్షన్లు తీసుకునేందుకు అది అవసరం లేదని తెలిపింది.
సీబీఎస్ఈ, నీట్, జేఈఈ, యూజీసీ ప్రవేశ పరీక్షలు, పాఠశాలల్లో ప్రవేశాలు, ఉచిత విద్య కోసం కూడా ఆధార్ అవసరం లేదని తెలిపింది. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సబ్సిడీల కోసం ఆధార్ అవసరమే అని తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అయితే.. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైనపలు పిటిషన్లపై విచారణ పూర్తిచేసిన ఉన్నత న్యాయస్ధానం ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ను ఇవ్వనుంది.