AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూజా హెగ్దే, రామ్ చరణ్ మళ్లీ కలవనున్నారా..? ‘మెగా సినిమా’లో తళుక్కుమననున్న సూపర్ జోడి.

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘రంగస్థలం’ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలోని ‘జిగేల్ రాణి’ స్పెషల్ సాంగ్ మాస్ ప్రేక్షకులతో స్పెప్పులు వేయించింది.

పూజా హెగ్దే, రామ్ చరణ్ మళ్లీ కలవనున్నారా..? ‘మెగా సినిమా’లో తళుక్కుమననున్న సూపర్ జోడి.
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 26, 2020 | 8:32 AM

pooja pair with cherry: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘రంగస్థలం’ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలోని ‘జిగేల్ రాణి’ స్పెషల్ సాంగ్ మాస్ ప్రేక్షకులతో స్పెప్పులు వేయించింది. ఇందులో కనిపించిన పూజా హెగ్దే తన డ్యాన్స్, అందంతో యువకులను ఆకట్టుకుంది. ఈ జంట స్క్రీన్‌పై కొన్ని నిమిషాలే కనపించినా వీరికి మంచి మార్కులు పడ్డాయని చెప్పాలి. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం.. రామ్ చరణ్, పూజా హెగ్దే మరోసారి స్క్రీన్‌ను షేర్ చేసుకోనున్నారని చర్చ జరుగుతోంది. అయితే ఈసారి కూడా పూర్తి స్థాయి సినిమాలో కాకుండా ప్రత్యేక పాత్రల ద్వారానే ఈ జంట కనిపించనుందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రంలో చెర్రీకి జోడిగా పూజా హెగ్దే నటించనున్నట్లు తెలుస్తోంది. ఆచార్యలో చెర్రీ కొద్దిసేపే కనిపించినా.. పాత్రకు మాత్రం ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. అలాగే చెర్రీకి జోడిగా పూజా అయితే బాగుంటుందని కొరటాల ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందిచాల్సిందే.