Petrol-Diesel Price: సామాన్యుడి జేబుకు చిల్లు? మరో రూ.5 పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కారణం ఇదే!
Petrol-Diesel Price: ప్రస్తుతం ముడి చమురు సరఫరా, డిమాండ్ల మధ్య అంతరం ముడి చమురు దిగుమతుల పెరిగిన వ్యయం, ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది ప్రభుత్వ రంగ చమురు కంపెనీల లాభనష్టాల లెక్కలను ప్రభావితం చేసింది..

Petrol-Diesel Price: మే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 8 శాతం పెరిగాయి. దీనివల్ల ప్రభుత్వ కంపెనీలకు లాభాలు వచ్చాయని భావించారు. కానీ ఈ వాదన అవాస్తవమని తేలింది. ప్రభుత్వ చమురు కంపెనీల నష్టాలు పెరిగాయని వెలుగులోకి వస్తోంది. అందువల్ల, రాబోయే రోజుల్లో ఇంధనం మళ్లీ ఖరీదవుతుందని అంచనా వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ రూ.5 మేర పెరుగుతాయేమోనని భయం నెలకొంది. ముడి చమురు ధరల పెరుగుదల, పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ సుమారు రూ.610 కోట్లు నష్టపోతున్నాయని చెబుతున్నారు.
ఐసిఆర్ఏ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్రూప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ వశిష్ట్ ప్రకారం.. మే 15న పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు మొత్తం సుమారు రూ. 7.5 మేర పెరిగాయి. ఈ ధరల పెంపు తర్వాత కూడా ప్రభుత్వ చమురు కంపెనీలు ఓఎంసీల పెట్రోల్పై లీటరుకు సుమారు రూ. 5.5, డీజిల్పై లీటరుకు సుమారు రూ. 4.5 నష్టపోతున్నాయి. ఈ మూడు ప్రభుత్వ కంపెనీల గణాంకాలను పరిశీలిస్తే, ఈ కంపెనీలు ప్రతిరోజూ సుమారు రూ. 610 కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ. 5 మేర పెరిగే అవకాశం ఉందని వశిష్ట్ అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Gold Price Today: మహిళలకు అదిరిపోయే శుభవార్త.. రూ.4 వేలు తగ్గిన బంగారం ధర.. వెండిపై రూ.15 వేలు..!
ఇంధన నష్టాలే కాకుండా, ఐసీఆర్ఏ అంచనాల ప్రకారం, ఎల్పీజీపై ప్రతి సిలిండర్కు సుమారు రూ. 680 నష్టం వస్తోంది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై రోజుకు సుమారు రూ. 93 కోట్ల నష్టం వాటిల్లుతోంది. క్రిసిల్ రేటింగ్స్ విశ్లేషణ ప్రకారం.. ముడి చమురు ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 10 వరకు పెరిగే బలమైన అవకాశం ఉంది.
ముడి చమురు ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా?
ప్రస్తుతం ముడి చమురు సరఫరా, డిమాండ్ల మధ్య అంతరం ముడి చమురు దిగుమతుల పెరిగిన వ్యయం, ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది ప్రభుత్వ రంగ చమురు కంపెనీల లాభనష్టాల లెక్కలను ప్రభావితం చేసింది. ఇది నేరుగా వినియోగదారుల జేబులపై ప్రభావం చూపుతోంది. ద్రవ్యోల్బణం భారాన్ని వినియోగదారులు మోయవలసి వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో, ముడి చమురు ధరలు సాధారణంగా బ్యారెల్కు $112 వద్ద ఉన్నాయి. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. కొందరి ప్రకారం.. ఇరాన్తో ఒప్పందం తుది దశలో ఉంది. ఇజ్రాయెల్ చర్యలు తీసుకోకపోతే ముడి చమురు ధరలు భారీగా పడిపోతాయి. కానీ ప్రస్తుతానికి మధ్యప్రాచ్యంలో ఘర్షణ ఆగలేదు. హోర్ముజ్ జలసంధి, లెబనాన్పై దాడులు కీలక అంశాలుగా మారాయి.
ఇది కూడా చదవండి: Edible Oil: ఇక అలాంటివేమి కుదరదు.. వంట నూనెల ప్యాకింగ్పై కేంద్రం కీలక నిర్ణయం..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




