June 03, 2026
Subhash
ఇండియాన్ రైల్వే నిబంధనల ప్రకారం.. కొన్ని షరతులతో మీ స్లీపర్ టికెట్ను ఏసీగా మార్చుకోవచ్చు. రైల్వే దీనికి అనుమతిస్తుంది.
మీరు రైలు ఎక్కాక ముందుగా టీటీఈని సంప్రదించాలి. ఏసీ సీటు కోసం ఆయన్ని అడగాలి. సీట్లు ఉంటే ఏసీ టికెట్ ధరతో సమానంగా డబ్బులు తీసుకుని కేటాయిస్తారు.
ఏసీ కోచ్లో ఖాళీ సీట్లు ఉంటేనే టీటీఈ మీ టికెట్ను అప్గ్రేడ్ చేయగలరు. సీట్లు నిండిపోతే కుదరదు. అప్పుడే సాధ్యమవుతుందని గుర్తించుకోండి.
టికెట్ మారాలంటే స్లీపర్, ఏసీ ఛార్జీల మధ్య ఉన్న తేడా డబ్బులను టీటీఈకి చెల్లించాల్సి ఉంటుంది. అదనపు మొత్తం చెల్లిస్తే ఏసీ కోచ్లో ప్రయాణించవచ్చు.
స్లీపర్ రూ.400, ఏసీ రూ.1,200 అనుకుంటే.. మీరు మిగిలిన రూ.800 వ్యత్యాసం చెల్లించి ఏసీకి మారొచ్చు.
టీటీఈ అనుమతి లేకుండా నేరుగా ఏసీ కోచ్లోకి వెళ్తే రైల్వే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి. అందుకే ముందు రూల్స్ తెలుసుకోండి.
అనుమతి లేకుండా ప్రయాణిస్తే ఛార్జీల వ్యత్యాసంతో పాటు టీటీఈ మీకు భారీ జరిమానా (Penalty) విధించవచ్చు.
సరైన కారణం చెప్తే జరిమానా లేకుండా తర్వాతి స్టేషన్లో స్లీపర్కు పంపుతారు. కాబట్టి టీటీఈ అనుమతితోనే ఏసీకి మారండి.