షాకింగ్…ఇకపై చంద్రబాబు పక్కన ఎన్ఎస్జీ కమాండోస్ కనిపించరు
కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎల్లవేళలా రక్షణ కల్పించే ఎన్ఎస్జీ కమాండోస్ను ఉపసంహరించనుంది. ఆయనకు ఒక్కరికే కాదు ఎవరైతే జడ్ ఫ్లస్ క్యాటగిరీ హోదాలో ఎన్ఎస్ఎజీ గార్డ్స్ సర్వీసులు పొందుతున్నారో, ఆయా ప్రముఖులకు గార్డ్స్ని రిమూవ్ చేయనుంది. వారి స్థానంలో పారా మిలిటరీ ఫోర్సస్ వీరి సెక్యురిటీని పర్యవేక్షనుంచనున్నాయి. కాగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం 13 మంది ప్రముఖులకు నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ రక్షణ కల్పిస్తున్నారు. చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, రాజ్ నాథ్ […]
కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎల్లవేళలా రక్షణ కల్పించే ఎన్ఎస్జీ కమాండోస్ను ఉపసంహరించనుంది. ఆయనకు ఒక్కరికే కాదు ఎవరైతే జడ్ ఫ్లస్ క్యాటగిరీ హోదాలో ఎన్ఎస్ఎజీ గార్డ్స్ సర్వీసులు పొందుతున్నారో, ఆయా ప్రముఖులకు గార్డ్స్ని రిమూవ్ చేయనుంది. వారి స్థానంలో పారా మిలిటరీ ఫోర్సస్ వీరి సెక్యురిటీని పర్యవేక్షనుంచనున్నాయి. కాగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం 13 మంది ప్రముఖులకు నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ రక్షణ కల్పిస్తున్నారు. చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, రాజ్ నాథ్ సింగ్, మాయావతి, ములాయం సింగ్ యాదవ్, శర్వానంద సోనోవాల్, ఎల్కే అద్వానీ, ప్రకాశ్ సింగ్ బాదల్, ఫరూక్ అబ్దుల్లా తదితరులు ఈ లిస్ట్లో ఉన్నారు. నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ని.. బ్లాక్ క్యాట్ కమాండోస్ అని కూడా అంటారు. గత రెండు దశాబ్దాలుగా బ్లాక్ క్యాట్ కమాండోస్ ఒక్కో విఐపీకి 24 మంది చొప్పున రక్షణనిస్తున్నారు.
కౌంటర్ టెర్రరిజం ఆఫరేషన్స్ కోసం 1984లో ఈ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాతి కాలంలో హైరిస్క్ ఉన్న ప్రముఖుల రక్షణ కారణంగా వారిలో కొందరిని ‘వివిఐపీ ప్రొటెక్షన్’కు బదలాయించారు.ఈ బాధ్యతలు వారిని అదనపు భారం కావడంతోనే తొలిగించినట్టు హోంశాఖ అధికారులు తెలిపారు. ఏకకాలంలో వివిధ చోట్ల ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు సేవలందిచేందుకు ఇబ్బంది అవుతోందని, అది కూడా ఒక కారణంగా పేర్కొన్నారు. కాగా ఇటీవలే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు గాంధీ కుటుంబానికి రక్షణగా ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్స్ రక్షణగా ఉండగా వారిని తొలగించింది కేంద్రం. ఇందుకోసం పార్లమెంట్లో చట్టాన్ని సవరించింది.