AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్!

హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎర్రమంజిల్‌లో భవనాలు కూల్చివేయొద్దంటూ దాఖలైన అన్ని వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు సోమవారం తన తీర్పును వెలువరించింది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలని మంత్రివర్గం తీసుకున్న తీర్మానాన్ని కొట్టివేసింది. మంత్రివర్గ నిర్ణయం చట్టపరిధిలో లేదని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని.. ఎర్రమంజిల్‌లోని భవనాలను కూల్చివేయొద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న వాదనతో ఏకీభవించింది. […]

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్!
Ram Naramaneni
| Edited By: |

Updated on: Sep 16, 2019 | 6:42 PM

Share

హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎర్రమంజిల్‌లో భవనాలు కూల్చివేయొద్దంటూ దాఖలైన అన్ని వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ మేరకు సోమవారం తన తీర్పును వెలువరించింది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మించాలని మంత్రివర్గం తీసుకున్న తీర్మానాన్ని కొట్టివేసింది. మంత్రివర్గ నిర్ణయం చట్టపరిధిలో లేదని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని.. ఎర్రమంజిల్‌లోని భవనాలను కూల్చివేయొద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్న వాదనతో ఏకీభవించింది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ కూల్చివేతపై నిజాం వారసులు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు కోర్టుకెక్కారు. అసెంబ్లీ భవనం కోసం చారిత్రక భవనాన్ని కూల్చడం ఎంత వరకు సమంజసమని వాదించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఎర్రమంజిల్‌లో అసెంబ్లీని కట్టకూడదని ఆదేశించింది.

కాగా, ఎర్రమంజిల్‌లో మొత్తం 16 ఎకరాల స్థలంలో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తోంది తెెలంగాణ ప్రభుత్వం. అసెంబ్లీ భవనానికి జూన్ 27న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వచ్చే ఉగాది లోపు కొత్త సచివాలయంతో పాటు కొత్త అసెంబ్లీ నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఆ దిశగా పనులు కూడా జరుగుతున్నాయి. ఐతే ఎర్రమంజిల్‌లో పురాతన భవనాల కూల్చివేతకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలవడంతో దానిపై విచారించిన కోర్టు.. అక్కడి భవనాలను కూల్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

Follow Us
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
ఒమేగా-3 VS ఫిష్ ఆయిల్..గుండె, మెదడుకు ఏది బెస్ట్? డైటీషియన్ల సూచన
ఒమేగా-3 VS ఫిష్ ఆయిల్..గుండె, మెదడుకు ఏది బెస్ట్? డైటీషియన్ల సూచన
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
హనుమాన్ జయంతికి ఈ స్వీట్ బూందీ ప్రసాదంగా చేస్తే.. జనాలు ఫిదా
హనుమాన్ జయంతికి ఈ స్వీట్ బూందీ ప్రసాదంగా చేస్తే.. జనాలు ఫిదా
లోన్‌ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్‌!
లోన్‌ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్‌!
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే..?
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే..?
మాల్స్‌లోకి వెళ్లగానే గాలి ఎందుకు అంత బలంగా వస్తుంది! అసలు రహస్యం
మాల్స్‌లోకి వెళ్లగానే గాలి ఎందుకు అంత బలంగా వస్తుంది! అసలు రహస్యం
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు.. లైవ్ వీడియో
పార్లమెంట్‌లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు.. లైవ్ వీడియో
తెలంగాణను పాలిస్తోంది రేవంత్ కాదు.. చంద్రబాబే
తెలంగాణను పాలిస్తోంది రేవంత్ కాదు.. చంద్రబాబే
నీళ్లను ఏపీ దోచుకెళ్లాక ఇప్పుడు ధర్నా చేసి ఏం ప్రయోజనం
నీళ్లను ఏపీ దోచుకెళ్లాక ఇప్పుడు ధర్నా చేసి ఏం ప్రయోజనం
సోషల్ మీడియా డాక్టర్స్ తో పేషెంట్స్ కు ఉపయోగమేనా?
సోషల్ మీడియా డాక్టర్స్ తో పేషెంట్స్ కు ఉపయోగమేనా?
ఇరాన్ - ఇజ్రాయెల్ వార్‌లోకి కేఏ పాల్ ఎంట్రీ!
ఇరాన్ - ఇజ్రాయెల్ వార్‌లోకి కేఏ పాల్ ఎంట్రీ!
మీ దంతాల ఏజ్ ఎంతో మీకు తెలుసా..? నిమిషాల్లో ఇలా చెక్ చేసుకోండి
మీ దంతాల ఏజ్ ఎంతో మీకు తెలుసా..? నిమిషాల్లో ఇలా చెక్ చేసుకోండి