నిర్భయ కేసులో మరో ట్విస్ట్.. సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం
Nirbhaya Convicts Hanging: నిర్భయ దోషుల ఉరిశిక్షపై పటియాలా హౌస్ కోర్టు స్టే విధించడాన్ని సవాలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. వీరిని వేరువేరుగా ఉరి తీయాలన్న కేంద్రం అభ్యర్ధనను న్యాయస్థానం తోసిపుచ్చింది. దోషులు తమకు న్యాయపరంగా గల హక్కులను వినియోగించుకోవడానికి వారికీ ఢిల్లీ హైకోర్టు వారం రోజుల గడువునిచ్చింది. ఈ గడువు ముగిసిన తరువాత.. వారి ఉరికి సంబంధించి విచారణ ప్రక్రియను ట్రయల్ కోర్టు ప్రారంభిస్తుందని […]
Nirbhaya Convicts Hanging: నిర్భయ దోషుల ఉరిశిక్షపై పటియాలా హౌస్ కోర్టు స్టే విధించడాన్ని సవాలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. వీరిని వేరువేరుగా ఉరి తీయాలన్న కేంద్రం అభ్యర్ధనను న్యాయస్థానం తోసిపుచ్చింది. దోషులు తమకు న్యాయపరంగా గల హక్కులను వినియోగించుకోవడానికి వారికీ ఢిల్లీ హైకోర్టు వారం రోజుల గడువునిచ్చింది. ఈ గడువు ముగిసిన తరువాత.. వారి ఉరికి సంబంధించి విచారణ ప్రక్రియను ట్రయల్ కోర్టు ప్రారంభిస్తుందని కోర్టు తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం రెండూ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీమ్లో పిటిషన్ వేశారు.
నిర్బయ కేసులోని దోషులు అందరికి ఒకేసారి ఉరిశిక్షను అమలు చేయాలి.. వేరువేరుగా ఉరి తీయకూడదన్న హైకోర్టు. 2017లో నిందితుల పిటిషన్లను సుప్రీమ్ కోర్టు తిరస్కరించిన తర్వాత డెత్ వారెంట్ జారీ చేయడానికి చర్యలు ఎందుకు తీసుకోలేదని సంబంధిత అధికారులను న్యాయస్థానం నిందించింది. కాగా, ఈ కేసులోని నలుగురు దోషులను ఉరి తీయడంపై జనవరి 31న ట్రయిల్ కోర్టు స్టే విధించింది. నిందితులు ముఖేష్ కుమార్(32), పవన్ గుప్త(25), వినయ్ కుమార్(26), అక్షయ్ కుమార్(31)లు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.