నిహారిక పెళ్లికి పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు, రాజస్థాన్‌లోని ఉదయ్ విలాస్ లో మెగా ఫ్యామిలీ ఫుల్ జోష్

మెగా ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్‌ రాష్ట్రంలో ల్యాండ్ అయింది. రేపు(డిసెంబర్ 9వ తేదీ) నిహారిక పెళ్లి రాజస్థాన్ లోని ఉదయ్ విలాస్‌లో..

నిహారిక పెళ్లికి పరిమిత సంఖ్యలో ఆహ్వానాలు, రాజస్థాన్‌లోని ఉదయ్ విలాస్ లో మెగా ఫ్యామిలీ ఫుల్ జోష్
Follow us

|

Updated on: Dec 08, 2020 | 9:25 PM

మెగా ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్‌ రాష్ట్రంలో ల్యాండ్ అయింది. రేపు(డిసెంబర్ 9వ తేదీ) నిహారిక పెళ్లి రాజస్థాన్ లోని ఉదయ్ విలాస్‌లో జరుగుతోన్న నేపథ్యంలో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీకి చెందిన ఫ్యామిలీస్ అన్నీ వేడుకకోసం ఉదయ్ విలాస్ చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా అందరు మెగా హీరోలు కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. వేడుకకు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నారు. మెగా కుటుంబం కాకుండా కేవలం 120 మందిని మాత్రమే పెళ్లి వేడుకకు ఆహ్వానించారు. నిన్నటి నుండే ప్రీవెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. మెగా కాంపౌండ్ హీరోలంతా ఆటలు పాటలతో ఉదయ్ విలాస్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వేడుకకు పవన్ కళ్యాణ్ వెళ్తారా లేదా అనే సందేహం ఇంతవరకూ కొనసాగుతూ వచ్చింది. పవన్ రైతుల కోసం దీక్షలు, పర్యటనలు లాంటి రాజకీయ కార్యక్రమాల హడావిడిలో ఉండటంతో ఆయన వివాహారానికి వెళ్లలేరని కొందరు, వెళ్తారని కొందరు అంటూ వచ్చారు. అయితే పవన్ పనులన్నింటినీ ముగించుకుని కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ఉదయపూర్ బయలుదేరారు. ఉదయ్‌ విలాస్‌లో డిసెంబర్‌ 9న అనగా రేపు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక, చైతన్యల వివాహం జరగనుంది.

Latest Articles