AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3.3 లక్షల కోట్ల రూపాయలతో.. 22 ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం..!

3.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో 22 ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించే ప్రణాళికను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఖరారు చేసింది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణ కోసం

3.3 లక్షల కోట్ల రూపాయలతో.. 22 ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణం..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 12, 2020 | 5:55 PM

Share

3.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో 22 ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించే ప్రణాళికను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఖరారు చేసింది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణ కోసం స్సెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ (ఎస్‌పీవీ)లను ఏర్పాటు చేయాలని కూడా ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయించింది. ఈ మెగా ప్లాన్‌లో భాగంగా తొలుత ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే కోసం తొలి ఎస్‌పీవీకి ఎన్‌హెచ్‌ఏఐ బోర్డు ఆమోదముద్ర వేసింది. పూర్తిగా హైవేస్‌ అథారిటీ భాగస్వామ్యంతో ఈ ఎస్‌పీవీ ఏర్పాటైందని అధికారులు తెలిపారు.

జాతీయ బ్యాంకులు, పెన్షన్ ఫండింగ్ ఏజెన్సీలు, విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపారని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు తెలిపాయి. ఎన్‌హెచ్‌ఏఐ స్వతంత్ర సంస్థ కావడంతో ఎస్‌పీవీకి బ్యాంకులు, ఆర్థిక సంస్ధలు, బీమా సంస్ధలు, పెన్షన్‌ నిధుల నుంచి రుణాలు పొందడం సులభతరం కానుంది. కాగా, రూ 45,000 కోట్ల విలువైన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ హైవే కోసం ఏర్పాటైన తొలి ఎస్‌పీవీలో ఎన్‌హెచ్‌ఏఐ రూ 5000 కోట్లు వెచ్చిస్తుండగా, మిగిలిన 40,000 కోట్లను రుణ మార్కెట్‌ నుంచి సమీకరించనున్నారు.

Read More:

తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు.. 9మంది మృతి!

ఆగస్టు 16 నుంచి వైష్ణోదేవి యాత్ర..  ఆంక్షలతో..!