కరోనా ఎఫెక్ట్: రంజాన్ నేపథ్యంలో.. ‘న్యూయార్క్’ మేయర్ కీలక నిర్ణయం..
కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. యూఎస్లో 'కొవిడ్-19' స్వైర విహారం చేస్తుండడంతో భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి.
కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. యూఎస్లో ‘కొవిడ్-19’ స్వైర విహారం చేస్తుండడంతో భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి. ఈ వైరస్ అగ్రరాజ్యాన్ని ఆర్థికంగాను దెబ్బతీసింది. ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇక న్యూయార్క్ నగరం పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఇక్కడ కరోనా బాధితులు రోజురోజుకీ గణనీయంగా పెరిగిపోతున్నారు. దీంతో న్యూయార్క్ ‘కొవిడ్-19’కు కేంద్ర స్థానంగా మారిపోయింది. వైరస్ కట్టడి కోసం ప్రజలను ఇళ్లకే పరిమితం చేశారు.
కాగా.. ఉద్యోగాలు కోల్పోయిన వారు, వలస కార్మికులు తినడానికి తిండిలేక ఫుడ్ బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేద వారి ఆకలి తీర్చేందుకు న్యూయార్క్ నగర మేయర్ బిల్ డే బ్లేసియో కీలక నిర్ణయం తీసుకున్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉచితంగా 500,000 హలాల్ మీల్స్ అందిస్తామని ప్రకటించారు. 435 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ద్వారా ఈ మీల్స్ అందిస్తామని తెలిపారు. ప్రధానంగా 32 కేంద్రాలను ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు బ్లేసియో తెలియజేశారు. ఈ కేంద్రాలకు ‘గ్రాబ్-అండ్-గో’ అని నామకరణం చేశారు.
మరోవైపు.. 400,000 మీల్స్ను నేరుగా కేంద్రాల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తామని, మిగిలిన 100,000 మీల్స్ను కమ్యూనిటీ సంస్థల ద్వారా అందిచనున్నట్లు బ్లేసియో వెల్లడించారు. అలాగే ఇంటి నుంచి బయటకు రాలేనివారికి హోమ్ డెలివరీ చేస్తామన్నారు. ఏప్రిల్లో 10 మిలియన్ల మీల్స్, మే నెలలో 15 మిలియన్ల మీల్స్ అందించేందుకు ప్రణాళిక రూపొందించామని బ్లేసియో చెప్పారు.