AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిశాలో లక్ష దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ అంతకంతకు పెరుగుతుంది. నిత్యం వేలాది మంది కొవిడ్ కోరల్లో చిక్కుకుంటున్నారు. అటు, ఒడిషాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య లక్ష మార్క్ దాటేసింది.

ఒడిశాలో లక్ష దాటిన కరోనా కేసులు
Balaraju Goud
|

Updated on: Aug 31, 2020 | 5:35 PM

Share

దేశంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ అంతకంతకు పెరుగుతుంది. నిత్యం వేలాది మంది కొవిడ్ కోరల్లో చిక్కుకుంటున్నారు. అటు, ఒడిషాలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య లక్ష మార్క్ దాటేసింది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 2,602 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,03,536కు చేరుకుంది. కరోనా వైరస్‌తో ఇవాళ కొత్తగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య మొత్తం 492కు చేరుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 29,758 యాక్టివ్‌ కేసులు ఉండగా, 73,233 మంది వైరస్‌ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా నమోదైన కేసుల్లో 1,561 క్వారంటైన్‌ కేంద్రాల నుంచి, 1,041 లోకల్‌ కాంటాక్టులని తెలిపింది. ఆదివారం ఒకే రోజు 57,877 శాంపిల్స్‌ పరీక్షించగా, ఇప్పటి వరకు 17,89,433 టెస్టులు చేసినట్లు వివరించింది. అత్యధికంగా రాష్ట్రంలో కొత్తగా కుర్దాలో అత్యధికంగా 616 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, కటక్‌లో 236, గంజాంలో 190, కేంద్రపాదలో 128, కొరపట్‌లో 127, జాజ్‌పూర్‌లో 103, బాలాసోర్‌లో 103 కేసులు రికార్డయ్యాయి. అలాగే కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండడంతో ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.