AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 7 కోట్ల బంగారు ఆభరణాల చోరీ కేసులో కానిస్టేబుల్ అరెస్ట్

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ఏడు కోట్ల రూపాయల బంగారు నగల చోరీ కేసులో ఓ కానిస్టేబుల్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఓషివారా పోలీస్ స్టేషన్‌‌లో పనిచేసే నిందితుడు

రూ. 7 కోట్ల బంగారు ఆభరణాల చోరీ కేసులో కానిస్టేబుల్ అరెస్ట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 03, 2020 | 9:31 PM

Share

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. ఏడు కోట్ల రూపాయల బంగారు నగల చోరీ కేసులో ఓ కానిస్టేబుల్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఓషివారా పోలీస్ స్టేషన్‌‌లో పనిచేసే నిందితుడు సంతోష్ రాథోడ్ నుంచి రూ.80 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. రాథోడ్‌తోపాటు నగల దుకాణం ఉన్న హౌసింగ్ సొసైటీలోని స్వీపర్ పంకజ్ రాంలివర్ గౌడ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు రాథోడ్‌కు కోర్టు ఈ నెల 6 వరకు రిమాండ్ విధించింది.

కాగా.. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నగరంలోని ఓ ఎన్జీవో అధ్యక్షుడు విపుల్ ఆనంద చంబ్రియ (35)తోపాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేసి రూ. 5.30 కోట్ల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి గత నెల 22న బాధితుడైన నగల వ్యాపారి నుంచి ఫిర్యాదు అందినట్టు పోలీసులు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ ఏరియాలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో కల్లు బుక్ చేసుకోవడమే కాదు…డబ్బులు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే పే చేస్తున్నారు.