AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మగబిడ్డ కోసం ఓ తల్లి చేసిన ఘోరం..

ఆరవ కాన్పులోనూ తనకు కొడుకు పుట్టలేదని తీవ్ర మనోవేదనకు గురైన ఓ తల్లి తన ఐదుగురు కూతుళ్లతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన రాజస్ధాన్‌‌లోని బాడ్మేర్ జిల్లాలో జరిగింది. ప్రతి కాన్పులోనూ ఆమెకు ఆడపిల్లలే పుట్టడంతో భర్త పెట్టిన చిత్ర హింసలు, అత్తింటి వేధింపులు భరించలేకపోయింది. గర్భం దాల్చిన ప్రతిసారి మగబిడ్డ పుడతాడని ఎంతగానో ఎదురుచూసినా..మళ్లీ మళ్లీ ఆడపిల్లలే జన్మిస్తుండటంతో ఆమె తీవ్రంగా కుమిలిపోయింది. బాడ్మేర్ జిల్లా బావ్డీ గ్రామానికి చెందిన రాణారామ్, వనూదేవీలకు […]

మగబిడ్డ కోసం ఓ తల్లి చేసిన ఘోరం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 28, 2019 | 8:16 PM

Share

ఆరవ కాన్పులోనూ తనకు కొడుకు పుట్టలేదని తీవ్ర మనోవేదనకు గురైన ఓ తల్లి తన ఐదుగురు కూతుళ్లతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన రాజస్ధాన్‌‌లోని బాడ్మేర్ జిల్లాలో జరిగింది. ప్రతి కాన్పులోనూ ఆమెకు ఆడపిల్లలే పుట్టడంతో భర్త పెట్టిన చిత్ర హింసలు, అత్తింటి వేధింపులు భరించలేకపోయింది. గర్భం దాల్చిన ప్రతిసారి మగబిడ్డ పుడతాడని ఎంతగానో ఎదురుచూసినా..మళ్లీ మళ్లీ ఆడపిల్లలే జన్మిస్తుండటంతో ఆమె తీవ్రంగా కుమిలిపోయింది.

బాడ్మేర్ జిల్లా బావ్డీ గ్రామానికి చెందిన రాణారామ్, వనూదేవీలకు 20ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంతోష(13),మమత(11),మైనా(9),హంస(9,హేమలత(3) అనే ఐదుగురు ఆడపిల్లలున్నారు. అయితే బుధవారం భర్త రాణారామ్ ఉద్యోగం నిమిత్తం స్కూలుకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరని గమనించి తన ఐదుగురు చిన్నారులను ఒక్కొక్కరిని బావిలోకి తోసేసి  చివరన తను కూడా దూకి  ఆత్మహత్యకు పాల్పడింది.  ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఒకేసారి చనిపోవడం, అందులోనూ ఐదుగురు చిన్నారులు మృతి చెందడంతో బావ్డీ గ్రామంలో విషాదం నెలకొంది. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.