AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎనిమిది నెలలుగా జవాన్ మిస్.. మంచులో మృతదేహం లభ్యం

ఎనిమిది నెలలుగా కనిపించని ఆర్మీ జవాన్ మృతదేహం ఎట్టకేలకు లభించింది. భారత సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద మంచు కింద శనివారం అర్మీ అధికారులు గుర్తించారు.

ఎనిమిది నెలలుగా జవాన్ మిస్.. మంచులో మృతదేహం లభ్యం
Balaraju Goud
|

Updated on: Aug 16, 2020 | 3:29 PM

Share

ఎనిమిది నెలలుగా కనిపించని ఆర్మీ జవాన్ మృతదేహం ఎట్టకేలకు లభించింది. భారత సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద మంచు కింద శనివారం అర్మీ అధికారులు గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని చమోలి గ్రామానికి చెందిన రాజేంద్ర సింగ్ నేగి (36) 2001లో ఆర్మీలో చేరారు. జమ్ముకశ్మీర్‌లోని 11 గర్హ్వాల్ రైఫిల్స్ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, గుల్మార్గ్ ప్రాంత సరిహద్దులోని ఎల్‌వోసీ వద్ద విధుల్లో ఉండగా జనవరి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో హవల్దార్ రాజేంద్ర సింగ్ అమరుడైనట్లు జూన్ 21న ఆర్మీ ప్రకటిస్తూ ఆయన కుటుంబానికి లేఖ రాసింది. కాగా, తన భర్త మృతదేహన్ని కళ్లారా చూసేంత వరకు ఈ విషయాన్ని తాను అంగీకరించబోనని భార్య రాజేశ్వరి దేవి తెలిపింది.

ఇదిలావుండగా, శనివారం దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ తనిఖీలు చేపట్టగా భారీ మంచు కింద జవాన్ రాజేంద్ర సింగ్ మృతదేహం లభించింది. దీంతో శ్రీనగర్‌లోని ఆర్మీ ఆస్పత్రికి రాజేంద్ర పార్థీవదేహన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. జవాన్ భార్య నివాసం ఉంటున్న డెహ్రాడూన్‌కు రాజేంద్ర సింగ్ పార్థీవ దేహన్ని పంపిస్తామని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు ఆర్మీ అధికారులు. దీంతో చమోలిలో ఉంటున్న జవాన్ తల్లిదండ్రులు డెహ్రాడూన్‌కు చేరుకుంది. సైనిక లాంఛనాల నడుమ ఆయన పార్థీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Follow Us