బాలసుబ్రహ్మణ్యం సతీమణికి కరోనా పాజిటివ్
ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకి ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే
Balasubrahmanyam wife Corona: ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యంకు కరోనా సోకి ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆయన సతీమణి సావిత్రికి కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మూడు రోజుల క్రితమే సావిత్రికి పాజిటివ్గా నిర్ధారణ కాగా.. ఆమె కూడా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా మరోవైపు ఎస్పీబీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కరోనా నుంచి కోలుకునేందుకు బాలుకి ప్లాస్మా ట్రీట్మెంట్ చేశారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం కంటే ప్రస్తుతం తన తండ్రి పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని, ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి వదంతులు నమ్మొద్దని కుమారుడు ఎస్పీ చరణ్ సూచించారు. ఇదిలా ఉంటే ఎస్పీబీ త్వరగా కోలుకోవాలంటూ సినీ ప్రముఖులు మొదలు సామాన్యులు కోరుకుంటున్నారు.
Read More: