రెండు నెలల తర్వాతే మేయర్‌పీఠం డిసైడ్.. తేల్చిచెప్పిన మంత్రి కేటీఆర్.. ఈ రెండు నెలలు ఎందుకంటే…

గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్ పీఠంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ మేయర్‌ పీఠంపై ఎవరు కూర్చునేది నిర్ణయించేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉందన్నారు...

రెండు నెలల తర్వాతే మేయర్‌పీఠం డిసైడ్.. తేల్చిచెప్పిన మంత్రి కేటీఆర్.. ఈ రెండు నెలలు ఎందుకంటే...
Follow us

|

Updated on: Dec 04, 2020 | 10:11 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్ పీఠంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ మేయర్‌ పీఠంపై ఎవరు కూర్చునేది నిర్ణయించేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితాలు రాలేదన్నారు.

మరో 20-25 సీట్లు అదనంగా వస్తాయని అనుకున్నాం.. కానీ, ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాయి. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయని చెప్పారు. ఈ ఫలితాలను చూసి నిరాశ చెందనక్కరలేదని పార్టీ వర్గాలకు సూచించారు. 10-12 సీట్లును స్పల్ప తేడాతో కోల్పోయామని చెప్పారు.

టీఆర్ఎస్‌ను అతిపెద్ద పార్టీగా నిలబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నానని కేటీఆర్‌ అన్నారు. ఫలితాలపై విశ్లేషించుకొని ముందుకు సాగుతామని కేటీఆర్‌ అన్నారు. టీఆర్ఎస్‌కు ఓటువేసిన ప్రజలు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మేయర్ పీఠంపై ఎవరు కూర్చునేది నిర్ణయించేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉందన్నారు.