AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ ముక్క కోసం అమ్మాయిని చంపేశాడు

చెన్నై: హత్యలకు పలు కారణాలుంటాయి. అయితే అందులో కొన్ని మరీ సిల్లీగా కూడా ఉంటాయి. అలాంటి ఆశ్చర్యం కలిగించే సంఘటన ఒకటి తమిళనాడులో జరిగింది. చికెన్ ముక్క గొడవ కారణంగా హత్య జరిగింది. ఒక అమ్మాయి గొంతు కోసేశాడు ఒక అబ్బాయి. తమిళనాడులోని కేయంబేడులో పెద్ద పూల మార్కెట్ ఉంది. అయితే ఇక్కడకు పూలు కొనుగోలు చేసేందుకు ఒక అమ్మాయి, అబ్బాయి వచ్చారు. వీరిరువురు రోడ్డుపై ఉన్న చిన్న షాపు నుంచి తెచ్చుకున్న బిర్యానీని తింటున్నారు. అయితే […]

చికెన్ ముక్క కోసం అమ్మాయిని చంపేశాడు
Vijay K
| Edited By: |

Updated on: Oct 18, 2020 | 10:56 PM

Share

చెన్నై: హత్యలకు పలు కారణాలుంటాయి. అయితే అందులో కొన్ని మరీ సిల్లీగా కూడా ఉంటాయి. అలాంటి ఆశ్చర్యం కలిగించే సంఘటన ఒకటి తమిళనాడులో జరిగింది. చికెన్ ముక్క గొడవ కారణంగా హత్య జరిగింది. ఒక అమ్మాయి గొంతు కోసేశాడు ఒక అబ్బాయి. తమిళనాడులోని కేయంబేడులో పెద్ద పూల మార్కెట్ ఉంది. అయితే ఇక్కడకు పూలు కొనుగోలు చేసేందుకు ఒక అమ్మాయి, అబ్బాయి వచ్చారు. వీరిరువురు రోడ్డుపై ఉన్న చిన్న షాపు నుంచి తెచ్చుకున్న బిర్యానీని తింటున్నారు.

అయితే ఈ క్రమంలో తనకు ఒక్క ముక్క చికెన్ కూడా రాలేదని అబ్బాయిని అడిగింది అమ్మాయి. ఇది కాస్త గొడవగా మారి హత్యకు దారి తీసింది. కోపగించికున్న అబ్బాయి పక్కనే ఉన్న కత్తితో గొంతు కోసేశాడు. దీంతో ఆమె సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలేసింది. ఆమె వేసిన కేకలకు అక్కడే ఉన్నవారు గుమిగూడారు. దాడి చేసిన తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన అమ్మాయికి 25 సంవత్సరాలు.